Hyd-Vijayawada: రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల జన జీవనం స్థంభించిపోయింది. భారీ వరదలు పోటెత్తడంతో ప్రధాన రహాదారులన్నీ జలయమమయ్యాయి. చిల్లకల్లు నందిగామ వద్ద NH 65 పై వర్షం నీరు పొంగిపొర్లుతోంది. సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్లే మార్గంలో నాయకని గూడెం వద్ద పాలేరు నది పొంగిపొర్లుతోంది. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ్ పట్టణం దాటిన తర్వాత రామాపురం ఎక్స్ రోడ్ వద్ద వంతెన కూడా కూలిపోయింది. భద్రత కారణాల దృష్ట్యా తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని, అత్యవసర, అనివార్య పరిస్థితులలో ప్రయాణికులు ఈ క్రింది మార్గాలలో వెళ్లాలని పోలీసులు సూచించారు.
పూర్తిగా చదవండి..Hyd-Vijayawada: హైదరాబాద్ నుంచి విజయవాడ, ఖమ్మం రాకపోకలు బంద్.. ప్రత్యామ్నాయ రూట్లు ఇవే!
హైదరాబాద్ నుంచి విజయవాడ, ఖమ్మం రాకపోకలు పూర్తిగా స్థంభించిపోయాయి. సూర్యపేట-ఖమ్మం మార్గంలో పాలేరు నది పొంగిపొర్లుతోంది. దీంతో అత్యవసర ప్రయాణాలు ఉన్నవారికోసం కొన్ని ప్రత్యేక రూట్లు సూచించారు పోలీసులు.
Translate this News: