/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/chandrababuamaravathi1-1719476597.jpg)
Amaravati: ఈరోజు ఏపీ రాజధాని అమరావతికి ఐఐటీ నిపుణులు వెళ్లనున్నారు. గతంలో నిలిచిపోయిన భవనాల సామర్థ్యాన్ని ఇంజినీర్లు అధ్యయనం చేయనున్నారు. 2 రోజులపాటు రాజధానిలో కట్టడాల పరిశీలించనున్నారు. 2019కు ముందు నిర్మాణాలు ప్రారంభమై మధ్యలోనే పనులు నిలిచిపోయిన భవనాలను ఐఐటీ బృందం పరిశీలించనుంది. ఐఏఎస్ అధికారుల నివాసాలు, మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్ల నాణ్యతను అంచనా వేసే బాధ్యతను హైదరాబాద్ ఐఐటీకి అప్పగించింది ఏపీ సర్కార్.
Also Read : వయనాడ్ లో మృత్యుంజయుల కోసం రంగంలోకి డ్రోన్ రాడార్లు!