Visakhapatnam: వెలుగులోకి మరో టీవీ సీరియల్ నటి మోసం

టీవీ నటులు, సినిమా వాళ్ళు మోసాలు చేయడం ఈ మధ్య తురుచూ వింటున్నాం. ఇప్పుడు తాజాగా విశాఖలో ఇలాంటి మోసం మరొకటి బయటపడింది. నటి అడ్డాల ఐశ్వర్య తనను పెళ్ళి చేసుకుని మోసం చేసిందని...ఆమె భర్తే స్వయంగా ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Visakhapatnam: వెలుగులోకి మరో టీవీ సీరియల్ నటి మోసం
New Update

TV Serial Actor Addala Aishwarya : మరో టీవీ సీరియల్ నటి భాగోతం బటపడింది. నటి అడ్డాల ఐశ్వర్య తనను పెళ్లి చేసుకొని మోసం చేసిందని ఆమె భర్త పిన్నింటి శ్యామ్ కుమార్ మీడియాను ఆశ్రయించారు. పెళ్లైన తర్వాత 25లక్షలు కాజేసి..విడాకులివ్వాలని టార్చర్ చేసిందని చెబుతున్నారు.విడాకుల కోసం తనను, తన తల్లిదండ్రులను మానసికంగా వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శ్యామ్ కుమార్.అదీ కాక వేరే వ్యక్తితో ఐశ్వర్య వివాహేతర సంబంధ పెట్టుకొని...తన మీద కేసులు పెట్టి మరీ బెదిరిస్తోందని వాపోయారు. తనకు న్యాయం చేయాలని శ్మాయ్ కుమార్ కోరుతున్నారు.

మ్యాట్రిమోనీ ద్వారా పెళ్ళి..

2023 సెప్టెంబర్ 6న శ్యామ్ కుమార్, అడ్డాల ఐశ్వర్య వివాహం జరిగింది. కాపు మ్యాట్రిమోనీ ద్వారా సీరియల్ నటి ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నారు శ్యాం కుమార్. ఐశ్వర్య జీ తెలుగు, మాటీవీ, ఈటీవీ, జెమినీ టీవీల్లో ప్రసారమయ్యే టీవీ సీరియల్స్‌లో ఐశ్వర్య నటిస్తోంది. సీరియల్స్‌తో పాటు పలు సినిమాల్లోనూ నటిస్తోంది.అమ్మాయి గారు, పలుకే బంగారామాయెనా, అల వైకుంఠపురం, అత్తారింటికి దారేది సీరియల్స్‌ ఆమె నటించినవి.

పెళ్ళయిన నెలరోజులకే..

పెళ్లయిన నెల రోజులకే ఐశ్వర్య మోసం బయటపడింది. ఆమెకున్న వివాహేతర సంబంధం కూడా అప్పుడే బయటపడిందని పిన్నింటి శ్యామ్ కుమార్ చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన ఓ రియల్టర్‌ కరణం రమేష్‌ బాబుతో ఐశ్వర్య వివాహేతర సంబంధం పెట్టుకొని...తనపై బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఐశ్వర్య విషయం ప్రస్తుతం చిత్ర పరిశ్రమ, టీవీ ఫీల్డ్‌లో హాట్ టాపిక్ అయింది.

Also Read:Australia: అవును..నా భార్యను నేనే చంపాను..ఆస్ట్రేలియా మహిళ హత్యలో నమ్మలేని నిజాలు

#visakhapatnam #addala-aishwarya
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe