CM Chandrababu: తెలంగాణ టీడీపీ కీలక నిర్ణయం.. ఈ నెల 7న సీఎం చంద్రబాబుకు సన్మానం

TG: సీఎం చంద్రబాబు ఈ నెల 7న హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్ లో కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పార్టీ అధినేతకు ఘనసన్మానం చేయాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించింది. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి నాయకులు ఎన్టీఆర్ భవనకు తరలిరావాలని పిలుపునిచ్చింది.

CM Chandrababu: నేడు తెలంగాణ టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
New Update

CM Chandrababu: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 7న హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్ లో కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా పార్టీ అధినేతకు ఘనసన్మానం చేయాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించింది. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ భవనకు తరలిరావాలని పిలుపునిచ్చింది.

ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు తొలిసారి ఈ నెల 5వ తేదీ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ వస్తున్నారు. ఈ నేపథ్యంలో బేగంపేట విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికేందుకు రాష్ట్ర పార్టీ సిద్ధమైంది. 6న ప్రజాభవన్ లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. 7వ తేదీ ఉదయం 11 గంటలకు ఎన్టీఆర్ భవన్ కు వస్తారు. ఈ సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షుడికి పెద్దఎత్తున సన్మాన కార్యక్రమాన్ని రాష్ట్ర పార్టీ ఏర్పాటు చేస్తోంది.

#cm-chandrababu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి