AP Crime: అన్నమయ్య జిల్లాలో పరువు హత్య కలకలం.. పేరెంట్సే చంపేశారా?

తంబళ్లపల్లెలో పరువు హత్య జరిగిందన్న వార్త కలకలం రేపుతుంది. ఆత్మహత్య చేసుకున్న బాలిక మృతదేహాన్ని పేరెంట్స్ సీక్రెట్ గా దహనం చేయడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వరుసకు అన్న అయ్యే వ్యక్తిని ప్రేమించిందన్న కారణంతో ఆ బాలికను హత్య చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

AP Crime: అన్నమయ్య జిల్లాలో పరువు హత్య కలకలం.. పేరెంట్సే చంపేశారా?
New Update

AP Crime: అన్నమయ్య జిల్లాలో పరువు హత్య కలకలం రేపుతుంది. తంబళ్లపల్లె మండలంలో ఓ మైనర్ బాలిక గత నెల 22న ఇంటి నుంచి పారిపోయింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ బాలికను వెతికి తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే ఆ బాలిక రెండు రోజుల క్రితం అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. తల్లిదండ్రులు గుట్టుచప్పుడు కాకుండా శవాన్ని కాల్చివేశారు. దీంతో ఈ ఘటనపై పలు అనుమాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరుసకు అన్న అయిన వ్యక్తిని ఆ బాలిక ప్రేమించి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.

తల్లిదండ్రుల ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను వెతికి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ బాలిక మొన్న రాత్రి ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లి పెద్దమండెం మండలం బండ్రేవు అడవిలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించింది. అయితే.. తల్లిదండ్రులు మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా దహనం చేశారు. అయితే.. బాలిక మరణంపై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇష్టం లేని‌ ప్రేమ పెళ్లి చేసుకుందన్న కారణంగా.. తల్లిదండ్రులే చంపి ఊరివేసి ఉంటారని భావిస్తున్నారు. దీంతో పలువురు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు వీఆర్వో ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులను విచారిస్తున్నారు. బాలికది హత్యా? లేక ఆత్మహత్యా? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: మెట్‌పల్లిలో రెండేళ్ల బాలుడి కిడ్నాప్

#ap-crime
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి