Heritage Shares: ఎన్నికల్లో జయభేరి..హెరిటేజ్ కు ఐదు రోజుల్లో  ఐదు వందల కోట్లు! ఎలా అంటే.. 

టీడీపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది.  ఎన్డీయే సర్కారు ఏర్పాటు నేపథ్యంలో మరోవైపు స్టాక్ మార్కెట్ దూసుకుపోతోంది. దీంతో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి హెరిటేజ్ కంపెనీ షేర్లు పరుగులు తీశాయి. ఆ ఎఫెక్ట్ తో ఐదు రోజుల్లో భువనేశ్వరి షేర్ సంపద రూ.584 కోట్లు పెరిగింది. 

New Update
Heritage Shares: ఎన్నికల్లో జయభేరి..హెరిటేజ్ కు ఐదు రోజుల్లో  ఐదు వందల కోట్లు! ఎలా అంటే.. 

Heritage Shares:  ఓట్ల లెక్కింపు రోజున స్టాక్ మార్కెట్ కుప్పకూలినప్పటికీ ఆ తర్వాత బాగా కోలుకుంది. చాలా మంది సంపద పెరిగింది. ఎన్డీయే 3.0 ప్రభుత్వంలో కింగ్‌మేకర్‌గా ఉన్న చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి షేర్ సంపద ఐదు రోజుల్లో రూ.584 కోట్లు పెరిగింది. జూన్ 4న ఎన్నికల ఫలితాల రోజున స్టాక్ మార్కెట్ పతనం అయినప్పటికీ హెరిటేజ్ సంపద తగ్గకపోవడం విశేషం. నారా భువనేశ్వరి హెరిటేజ్ ఫుడ్స్ యజమాని. ఆమె వాటా రూ. 24.37గా ఉంది. ఫలితంగా వెయ్యి కోట్ల రూపాయల విలువైన స్టాక్ సంపదకు ఆమె ఓనర్ అయ్యారు.

Heritage Shares:  జూన్ 3వ తేదీ సోమవారం నాడు హెరిటేజ్ ఫుడ్ షేరు ధర రూ.402.90. ఇప్పుడు దీని ధర రూ.661.25కి పెరిగింది. హెరిటేజ్ ఫుడ్స్‌లో నారా భువనేశ్వరి 2,26,11,525 షేర్లను కలిగి ఉన్నారు. అంటే 2.26 కోట్ల షేర్ ని సొంతం చేసుకున్నారు. మే 31 వారాంతంలో ఈ షేర్ల మొత్తం విలువ రూ.911 కోట్లు. ప్రస్తుతం భువనేశ్వరి షేర్ సంపద రూ.1495 కోట్లకు పెరిగింది. అంటే కేవలం ఐదు రోజుల్లోనే ఆమె షేర్ సంపద రూ.584 కోట్లు పెరిగింది.

హెరిటేజ్ ఫుడ్స్ షేర్ ధర పెరగడానికి కారణం ఇదీ..
Heritage Shares:  హెరిటేజ్ ఫుడ్స్ ఆంధ్రా ఆధారిత సంస్థ. హెరిటేజ్ పాలు, పెరుగు మొదలైన పాల ఉత్పత్తులను విక్రయిస్తుంది. దీనికి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుండి సుదూర పంజాబ్ వరకు మార్కెట్ ఉంది. చంద్రబాబు నాయుడు 1992లో ఈ కంపెనీని స్థాపించారు. ఇప్పుడు అతని భార్య నారా భునవేశ్వరి యజమానిగా ఉన్నారు. 

Heritage Shares:  ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి పూర్తి మెజారిటీ సాధించిన తర్వాత హెరిటేజ్ ఫుడ్స్ షేర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. హెరిటేజ్ మాత్రమే కాదు, అనేక ఆంధ్రా ఆధారిత సంస్థల షేర్లు లాభపడుతున్నాయి. జూన్ 4న చాలా షేర్లు నెగిటివ్‌గా ఉన్నప్పటికీ, ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధించడంతో హెరిటేజ్ షేర్లకు డిమాండ్ పెరిగింది.

ఏప్రిల్ నెలలో హెరిటేజ్ ఫుడ్స్ షేరు ధర రూ.300. రెండు నెలల వ్యవధిలో రెండు కంటే ఎక్కువ లిస్టింగ్స్  విలువ పెరిగింది. దీని షేర్లలో ఎవరైనా ఏప్రిల్ 16న ఇన్వెస్ట్ చేసి ఉంటే, వారి లక్ష రూపాయల పెట్టుబడి ఈరోజు రూ.2 లక్షలకు మించి ఉండేది.

Advertisment
తాజా కథనాలు