America : అమెరికాలో దారుణం.. భారతీయుని ముఖం పై పిడిగుద్దులు.. మృతి!

అమెరికాలో మరో దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓక్లహామాలో ఓ హోటల్‌ మేనేజర్‌ గా పని చేస్తున్న 59 ఏళ్ల భారతీయ- అమెరికన్‌ హేమంత్‌ మిస్త్రీ అనే వ్యక్తి పై ఓ దుండగుడు దాడి చేసి పిడిగుద్దులు కురిపించాడు. దీంతో హేమంత్‌ ప్రాణాలు కోల్పోయాడు.

New Update
Telangana : అయ్యె.. తల్లికి అంత్యక్రియలు చేయకుండా.. అనాథగా వదిలేసి..

Mistry Of Indian American Man Death : అమెరికా (America) లో మరో దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓక్లహామాలో ఓ హోటల్‌ మేనేజర్‌ గా పని చేస్తున్న 59 ఏళ్ల భారతీయ-అమెరికన్‌ హేమంత్‌ మిస్త్రీ అనే వ్యక్తి పై ఓ దుండగుడు దాడి చేసి పిడిగుద్దులు కురిపించాడు. దీంతో హేమంత్‌ ప్రాణాలు కోల్పోయాడు.

ఈ దారుణ ఘటన జూన్ 22న రాత్రి 10 గంటల సమయంలో జరిగింది. 41 ఏళ్ల రిచర్డ్ లూయిస్ (Richard Lewis) అనే నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్లు . హోటల్ ప్రాంగణంలో ఉండొద్దంటూ హేమంత్ మిస్త్రీ కోరడంతో నిందితుడు ఆగ్రహంతో పిడిగుద్దులు (Fists) కురిపించాడని పోలీసులు వివరించారు. దెబ్బలు తాళలేక పోయిన మిస్త్రీ స్పృహతప్పి పడిపోయాడని, ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదని అధికారులు వెల్లడించారు. మిస్త్రీ చికిత్స పొందుతూ జూన్ 23న చనిపోయాడని చెప్పారు.

కాగా ఓ హోటల్‌లో దాక్కున్న నిందితుడు లూయిస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని ప్రస్తుతం ఓక్లహామా కౌంటీ జైలులో ఉంచారు. కాగా నిందితుడిని హోటల్ ప్రాంగణం నుంచి వెళ్లిపోవాలని ఎందుకు అడిగారో తెలియరాలేదని, దర్యాప్తు చేస్తామని పోలీసులు ప్రకటించారు. కాగా హేమంత్ మిస్త్రీ గుజరాత్‌ (Gujarat) కు చెందినవారు.

Also read: రాష్ట్రంలో రాగల నాలుగురోజులు వర్షాలే.. వర్షాలు!

Advertisment
తాజా కథనాలు