TS Rains: వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్..!

తెలంగాణలో రానున్న మూడురోజుల పాటు పలు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలులు వచ్చే అవకాశం ఉందని చెప్పింది.

TS Rains: వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్..!
New Update

Rain Alert In Telangana: తెలంగాణలో రానున్న మూడురోజుల పాటు పలు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. ఈ క్రమంలోనే ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ను కూడా జారీ చేసింది. నేటి నుంచి రేపటి ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Also Read: ప్రియుడి కోసం ముగ్గురు పిల్లల తల్లి ఏం చేసిందో చూడండి



రేపు వనపర్తి, జోగులాంబ గద్వాలలో వడగాలులు వీస్తాయని.. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగితాల్య, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మంగళవారం పలుచోట్ల తేలికపాటి జల్లులు కురుస్తాయని పేర్కొంది. ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలతో పాటు ములుగు, భూపాలపల్లి, మెదక్‌ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఉరుములు, మెరుపులతో వానలు కురుస్తాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

#telangana #heavy-rain-alert
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe