హాట్ టాపిక్ గా మారిన హార్థిక్ పాండ్యా భార్య నటాషా పోస్ట్!

కొద్ది రోజులుగా హార్దిక్ పాండ్యా,నటాషా విడాకుల తీసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో వైరలైయాయి.అయితే భారత్ టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత కూడా హార్థిక్ పై నటాషా ఏవిధంగా స్పందించలేదు.తాజాగా ఆమె ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

హాట్ టాపిక్ గా మారిన హార్థిక్ పాండ్యా భార్య నటాషా పోస్ట్!
New Update

భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, అతని భార్య నటాషా స్టాంకోవిచ్ విడాకులు తీసుకోబోతున్నారని గత కొన్ని నెలలుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. దీనిపై వారిద్దరూ ఏవిధంగా స్పందించలేదు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్ సిరీస్‌ని వీక్షించేందుకు కూడా నటాషా రాలేదు. టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత హార్దిక్ పాండ్యా మైదానంలో చాలాసేపు ఏడ్చాడు.దీని పై పలువురు కన్నీళ్లతో చాలా కాలంగా తన మనసులోని గాయానికి మందు రాస్తున్నాడని వ్యాఖ్యానించారు. అయితే టీ20 ప్రపంచకప్ గెలిచినందుకు నటాషా హార్థిక్ కు ఎటువంటి అభినందనలు తెలపలేదు.

ఈ పుకార్లకు నాటాషా తన పేరు నుండి పాండ్యా ఇంటిపేరును తొలగించటంతో ఆధ్యం పోసినటైంది. ఆ తర్వాత, నటాషా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి హార్దిక్ పాండ్యాతో చాలా ఫోటోలను కూడా తొలగించింది. అలాగే అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌కు హార్దిక్ పాండ్యా ఒంటరిగా వెళ్లాడు. ఈ సందర్భంలో, నటాషా స్టాంకోవిచ్ తన కొడుకుతో కలిసి ఉన్న ఫోటోను పంచుకుంది.

గత కొన్ని నెలలుగా తన పర్సనల్ లైఫ్ స్టైల్, ఫిట్ నెస్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ వస్తున్న నటాషా అప్పుడప్పుడు కొడుకుతో గడిపిన ఫోటోలు కూడా పోస్ట్ చేస్తుంది. అలాగే, నటాషా స్టాంకోవిచ్ జిమ్‌లో వర్కౌట్ చేసిన తర్వాత తన ఫోటోను షేర్ చేసింది.

ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, ఆమె మొదట తన కారులో తీసిన సెల్ఫీని పోస్ట్ చేసింది, ఆపై జిమ్‌లో ఆమె ఫోటో, తన కుమారుడు అగస్త్యతో కలిసి ఒక మ్యూజియంలో ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది, పోస్ట్‌కు క్యాప్షన్ చేస్తూ, నటాషా స్టాంకోవిక్ ఇలా రాశారు, 'నేను కృతజ్ఞతతో ఉన్నాను. నేను ఈ జీవితాన్ని గడుపుతున్నానని తెలిపింది.

నటాషా స్టాంకోవిచ్ మే 31, 2020న క్రికెటర్ హార్దిక్ పాండ్యాను హిందూ, క్రైస్తవ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి అగస్త్య అనే పాప ఉండగా, కొన్ని నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో నటాషా స్టాంకోవిచ్ తన పేరు నుండి పాండ్యా అనే ఇంటిపేరును తొలగించినప్పటి నుండి విడాకుల పుకార్లు వ్యాపించాయి.

టీ20 ప్రపంచకప్‌ను భారత్ గెలిచిన తర్వాత హార్దిక్ పాండ్యాను అభినందించని నటాషా స్టాంకోవిచ్ ఇలా వ్యాఖ్యానించింది, "ఈ రోజు నేను నిజంగా తెలుసుకోవలసినది చదవాలనుకుంటున్నాను, అందుకే నేను కారులో బైబిల్‌ను నాతో తీసుకువచ్చాను, ఎందుకంటే మీ అందరికీ చదవండి అని తెలిపింది.

'ప్రభువు మీకు ముందుగా వెళ్లి మీతో ఉంటాడు. అతను నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టడు. భయపడవద్దు లేదా నిరుత్సాహపడకండి. మీరు ఒక నిర్దిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు, దేవుడు మీతో ఉంటాడు. అతను ఇప్పటికే ఒక ప్రణాళికను కలిగి ఉన్నందున మీరు ఇప్పుడు ఏమి చేస్తున్నారో వారు ఆశ్చర్యపోరు” అని నటాషా పోస్ట్ చేసింది.

#hardik-pandya #natasha
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe