Guntur: వైసీపీకి షాక్..టీడీపీలోకి చేరిన కీలక నేతలు.!

ఏపీలో అధికార పార్టీ వైసీపీకి షాక్ తగిలింది. మంగళగిరి నియోజవర్గానికి చెందిన వైసీపీ కీలక నేతలు నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు.

Guntur: వైసీపీకి షాక్..టీడీపీలోకి చేరిన కీలక నేతలు.!
New Update

YCP Leaders Joined TDP Party: ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైంది. అధికార పార్టీ వైసీపీ ఇప్పటికే ఫస్ట్ లిస్ట్ ను విడుదల చేసింది. దీంతో సీటు దక్కని కొందరూ అసంతృప్తులు ఒక్కొక్కరిగా రాజీనామాలు చేస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ వైసీపీ నేతలు సైతం పార్టీ మారుతున్నారు. తాజాగా మంగళగిరి నియోజవర్గానికి చెందిన వైసీపీ కీలక నేతలు నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు.

Also read: వామ్మె.. బికినీలో దర్శనమిచ్చిన గుప్పెడంత మనసు సీరియల్ జగతి.!

ఉండ‌వ‌ల్లి నివాసంలో శ‌నివారం టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ స‌మ‌క్షంలో వైసీపీ నేత‌లు అయిన గుంటూరు జిల్లా ఆర్య వైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు సంకా బాలాజీ గుప్తా, మంగ‌ళ‌గిరి మాజీ కౌన్సిల‌ర్ మండ్రు రమాదేవి-మండ్రు రాము, మంగళగిరి వస్త్ర ఉత్పత్తి విక్రయదారుల సంఘం అధ్యక్షులు పెండెం శివరామ కృష్ణ (సిటీ కేబుల్) లు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి టిడిపి కండువాలు క‌ప్పి సాద‌రంగా స్వాగ‌తించారు టీడీడీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.

Also read: జగన్‌కు పీకే ఝలక్‌.. ఇక టీడీపీ కోసం వ్యూహాలు.. ఇదిగో ప్రూఫ్!

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. త్వ‌ర‌లో ఏర్ప‌డ‌బోయే ప్ర‌జాప్ర‌భుత్వంలో అన్నివ‌ర్గాల‌కి మేలు జ‌రుగుతుంద‌ని, రాష్ట్రాభివృద్ధి-ప్ర‌జాసంక్షేమం కోసం అంతా క‌లిసి ప‌నిచేద్దామ‌ని లోకేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ వ్యవహారాల సమన్వయకర్త నందం అబద్దయ్య, రాష్ట్ర టీడీపీ మైనారిటీ సెల్ కార్యదర్శి అబ్దుల్ మజీద్, తదితరులు ఉన్నారు.

#nara-lokesh #andhra-pradesh
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe