GST New Rule: జీఎస్టీ నిబంధనల్లో మార్పు.. చిన్న వ్యాపారులకు ఇబ్బందే.. 

జీఎస్టీ నిబంధనల్లో మార్పులు చేసింది ప్రభుత్వం. జీఎస్టీ కొత్త నిబంధనల ప్రకారం రూ.5 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారులు ఇప్పుడు ఇ-చలాన్ ఇవ్వకుండా ఇ-వే బిల్లు జారీ చేయలేరు. మార్చి 1 నుంచి వారి అన్ని రకాల వ్యాపార లావాదేవీలపై ఇది వర్తిస్తుంది. 

New Update
GST New Rule: జీఎస్టీ నిబంధనల్లో మార్పు.. చిన్న వ్యాపారులకు ఇబ్బందే.. 

GST New Rule: జీఎస్టీకి సంబంధించిన నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం భారీ మార్పులు చేసింది. కొత్త నిబంధనలు చిన్న వ్యాపారులపై ప్రభావం చూపుతాయి.  ముఖ్యంగా ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వ్యాపారం చేసే వారిపై ఈ ప్రభావం ఎక్కువ ఉంటుంది.  మార్చి 1 నుంచి కొత్త నిబంధనలు తప్పనిసరి కానున్నాయి.

కొత్త నిబంధన ఇదీ..
జీఎస్టీ కొత్త నిబంధనల ప్రకారం రూ.5 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారులు ఇప్పుడు ఇ-చలాన్ ఇవ్వకుండా ఇ-వే బిల్లు జారీ చేయలేరు. మార్చి 1 నుంచి వారి అన్ని రకాల వ్యాపార లావాదేవీలపై ఇది వర్తిస్తుంది. జీఎస్టీ పన్ను విధానంలో రూ.50,000 కంటే ఎక్కువ విలువైన వస్తువులను ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి పంపినప్పుడు ఈ-వే బిల్లును నిర్వహించడం తప్పనిసరి.

నిబంధనల్లో మార్పులు అందుకే..
కేంద్ర ప్రభుత్వ జాతీయ సమాచార కేంద్రం (NIC) తన విశ్లేషణలో చాలా మంది వ్యాపారవేత్తలు B2B అలాగే  B2E పన్ను చెల్లింపుదారులతో ఇ-ఇన్‌వాయిస్‌లతో లింక్ చేయకుండా ఇ-వే బిల్లుల ద్వారా లావాదేవీలు జరుపుతున్నట్లు గుర్తించింది. అయితే ఈ పన్ను చెల్లింపుదారులందరూ ఇ-చలాన్‌కు అర్హులు. దీని కారణంగా, కొన్ని సందర్భాల్లో ఇ-వే బిల్లు అలాగే  ఇ-చలాన్‌లలో నమోదు చేసిన విభిన్న సమాచారం ప్రమాణంతో సరిపోలడం లేదు. దీని కారణంగా, ఇ-వే బిల్లు అదేవిధంగా  ఇ-చలాన్ స్టేట్‌మెంట్ మధ్య పొంతన ఉండటం లేదు.

Also Read: స్వాతంత్య్రం తరువాత ఇప్పటి వరకూ టాక్స్ విధానం ఎలా మారిందంటే.. 

దీన్ని దృష్టిలో ఉంచుకుని, GST పన్ను చెల్లింపుదారులు మార్చి 1, 2024 నుండి ఇ-చలాన్ స్టేట్‌మెంట్ లేకుండా ఇ-వే బిల్లును రూపొందించవద్దని కోరారు. అంటే ఇప్పుడు ఈ వ్యాపారులు ఇ-వే బిల్లును రూపొందించడానికి ఇ-చలాన్ స్టేట్‌మెంట్‌ను సిద్ధం చేయాల్సి ఉంటుంది. అయితే, కస్టమర్లు లేదా నాన్ సప్లయర్‌లతో ఇతర లావాదేవీలకు, ఈ-వే బిల్లు మునుపటిలా పనిచేస్తుందని కూడా స్పష్టం చేసింది.

జీఎస్టీ విధానం..
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం జూలై 1, 2017 నుంచి దేశంలో జీఎస్టీ విధానాన్ని అమలులోకి తెచ్చింది. దేశంలోని అన్ని రకాల పరోక్ష పన్నులను ఒకే చోట ఏకీకృతం చేసేందుకు ఈ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఇది దేశంలో వ్యాపారాన్ని సులభతరం చేసింది, ఎందుకంటే ఇది వివిధ రాష్ట్రాల వేర్వేరు పన్ను వ్యవస్థలను మార్చింది. GSTలో ఏకాభిప్రాయాన్ని సృష్టించేందుకు, ప్రభుత్వం GST కౌన్సిల్‌ను కూడా ఏర్పాటు చేసింది.  దీని ఛైర్మన్ దేశ ఆర్థిక మంత్రిగా ఉంటారు. రాష్ట్రాల తరపున, వారి ఆర్థిక మంత్రులు లేదా వారి ప్రతినిధులు ఈ కౌన్సిల్‌లో సభ్యులుగా ఉంటారు. జీఎస్టీకి సంబంధించిన అన్ని నిర్ణయాలను తీసుకునే దేశంలో అత్యున్నత సంస్థ ఇదే.

Advertisment
తాజా కథనాలు