కిడ్నాప్ చేశారు.. తుపాకి ఎక్కుపెట్టి మరీ తాళి కట్టించారు

బిహార్‌లోని ఇటీవలె ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించిన గౌతమ్ అనే యువకుడ్ని కిడ్నాప్‌ చేయించి.. ఓ తండ్రి తన కూతురుతో పెళ్లి జరిపించాడు. సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. తుపాకి ఎక్కుపెట్టి తాళి కట్టించారని గౌతమ్ వాపోయాడు.

New Update
కిడ్నాప్ చేశారు.. తుపాకి ఎక్కుపెట్టి మరీ తాళి కట్టించారు

చాలామంది ప్రేమ పెళ్లిల్లు, పెద్దలు కుదిర్చిన పెళ్లిల్లు చేసుకుంటారు. మరికొందరు ఇంట్లో ఒప్పుకోలేదనే కారణంలో పారిపోయి వివాహం చేసుకుంటారు. ఇలాంటి ఘటనలు ఎక్కడో ఓ చోట నిత్యం జరుగూతూనే ఉంటాయి. అయితే తాజాగా బిహార్‌లో మాత్రం ఎవరూ ఊహించని ఓ విచిత్రమైన పెళ్లి జరిగింది. ఒక యువకుడిని కిడ్నాప్‌ చేసి ఓ అమ్మాయితో పెళ్లి జరిపించడం చర్చనీయాంశమైంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. వైశాలి అనే జిల్లాలో గౌతమ్ కుమార్ అనే వ్యక్తి ఇటీవలే ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించి విధుల్లో చేరాడు. అయితే బుధవారం మధ్యాహ్నం కొందరు వ్యక్తులు కార్లో వచ్చి.. గౌతమ్‌ను బలవంతంగా ఎక్కించుకొని పోయారు. ఆ తర్వాత రాజేశ్‌రాయ్ అనే వ్యక్తి.. గౌతమ్‌తో తన కుమార్తె మెడలో బలవంతంగా తాళి కట్టించాడు. సమాచారం తెలుసుకున్న గౌతమ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read: తెలంగాణ ఎన్నికల రిజల్ట్స్‌పై ఏపీలో జోరుగా బెట్టింగ్స్..

రాజేశ్‌రాయ్  గతంలో కూడా తన కూతురు చాందినీని వివాహం చేసుకోవాలని కోరాడని.. ఇందుకు గౌతమ్ తిరస్కరడంతో అతనిపై దాడి కూడా చేశారని ఫిర్యాదులో తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రాజేశ్‌రాయ్ ఇంటికి వెళ్లారు. అయితే అప్పటికే రాజేశ్‌.. కొత్త జంటను తన ఇంట్లోనే బంధించేశాడు. తుపాకి ఎక్కుపెట్టి మరీ తనతో తాళి కట్టించారని గౌతమ్.. పోలీసుల ముందు తన ఆవేదనను వ్యక్తం చేశాడు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్నారు.

Also Read: రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీస్ భద్రత పెంపు.. విజయానికి సంకేతమా?!

Advertisment
తాజా కథనాలు