TCS : తెలంగాణ యువతకు టాటా కంపెనీ అదిరిపోయే శుభవార్త.. ఏకంగా రూ.2 వేల కోట్లతో..!

ఐటీఐల్లో ప్రస్తుతం ఉన్న కోర్సుల స్థానంలో ఆధునిక పారిశ్రామిక అవసరాలతోపాటు ఉద్యోగం, ఉపాధి లభించేలా ట్రైనింగ్ కోర్సులు ప్రవేశపెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీంతో రూ. 2వేల కోట్లతో ఉపాధి ఆధారిత పారిశ్రామిక శిక్షణ ఇచ్చేందుకు టాటా టెక్నాలజీస్ ముందుకు వచ్చింది.

New Update
TCS : తెలంగాణ యువతకు టాటా కంపెనీ అదిరిపోయే శుభవార్త.. ఏకంగా రూ.2 వేల కోట్లతో..!

TATA : తెలంగాణ(Telangana) లోని విద్యార్థులకు 1,500 కోట్ల రూపాయల నుంచి 2,000 కోట్ల రూపాయల మధ్య ప్రతిపాదిత వ్యయంతో ఉద్యోగ ఆధారిత పారిశ్రామిక నైపుణ్యాభివృద్ధి శిక్షణ(Industrial Skill Development Training) ను అందించేందుకు టాటా టెక్నాలజీస్(Tata Technologies) ముందుకు వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. టాటా టెక్నాలజీస్‌ ప్రతినిధులతో ఇక్కడ సమావేశమైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Telangana Chief Minister Revanth Reddy) , ఆధునిక సాంకేతికతను అందించడంతోపాటు యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించడం ఎలా అనే అంశంపై చర్చించినట్లు సిఎంఓ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని ప్రభుత్వ ఐటీఐ(Industrial Training Institute) కళాశాలల్లో ఆధునిక కోర్సులను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

రాష్ట్రంలో నిర్వహణతోపాటు 4.0 స్కిల్లింగ్ సెంటర్ల (Industry 4.0 Technology Centers) ఏర్పాటుకు అవసరమైన యంత్రాలు, పరికరాలు, సాఫ్ట్‌వేర్‌లను టాటా టెక్నాలజీస్ అందజేస్తుందని తెలిపింది.ఐటీఐల్లో యువత కోసం ఇండస్ట్రియల్ ఆటోమేషన్, రోబోటిక్స్ తయారీ, అధునాతన సీఎన్‌సీ మెషిన్ టెక్నీషియన్లు, ఈవీ మెకానిక్, బేసిక్ డిజైనర్, వర్చువల్ వెరిఫైయర్ వంటి 4.0 పరిశ్రమ ఆధారిత శిక్షణా కోర్సుల్లో శిక్షణ అందించేందుకు టాటా టెక్నాలజీస్ సంసిద్ధతతో సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. టాటా టెక్నాలజీస్ 4.0 పరిశ్రమ ఆధారిత కోర్సులను అందించడానికి అవసరమైన యంత్రాలు, సాఫ్ట్‌వేర్‌తో పాటు ప్రతి ఐటీఐలో ఇద్దరు మాస్టర్ ట్రైనర్‌లను అందజేస్తుందని తెలిపింది.

ఉపాధి అవకాశాలు పొందేందుకు, యువత సొంతంగా పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా వ్యవస్థాపకతను పెంపొందించేందుకు వీలుగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని టాటా టెక్నాలజీస్ ప్రతినిధులకు ముఖ్యమంత్రి సూచించారు. కాలం చెల్లిన కోర్సుల స్థానంలో ఆధునిక జాబ్ ఓరియెంటెడ్ కోర్సులను ప్రవేశపెట్టాలని, టాటా టెక్నాలజీస్‌కు ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు.

1,500 కోట్ల నుంచి 2,000 కోట్ల రూపాయల వ్యయంతో ఉద్యోగ ఆధారిత పారిశ్రామిక నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందించేందుకు టాటా టెక్నాలజీస్ ((Tata Technologies) )తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతిస్తున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు.దాదాపు లక్ష మంది విద్యార్థులకు అనుకూలమైన శిక్షణ అందించేందుకు టాటా టెక్నాలజీస్ ముందుకు రావడం పట్ల సీఎం ప్రశంసలు కురిపించారు, రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థతో కలిసి పనిచేస్తుందని ప్రకటించారు. సంస్థతో ఎంఓయూ కుదుర్చుకునేందుకు ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆయన ఆదేశించారు.

ప్రభుత్వ యాజమాన్యంలోని ఐటీఐలకు ఐదేళ్ల పాటు శిక్షణ, సహాయాన్ని అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.ఇందులో భాగంగా, టాటా టెక్నాలజీస్ పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆధునిక సాంకేతిక వర్క్‌షాప్‌లతో అత్యంత డిమాండ్ ఉన్న తయారీ రంగంలో ఉపాధిని కల్పించే లక్ష్యంతో 22 కొత్త స్వల్పకాలిక, ఐదు దీర్ఘకాలిక కోర్సులను ఆఫర్ చేస్తుందని విడుదల చేసింది. రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ ఇప్పటికే టాటా టెక్నాలజీస్‌తో సంప్రదింపులు జరుపుతోందని, ఎంఓయూ కుదుర్చుకోవడానికి విధివిధానాలను ఖరారు చేసేందుకు ఇప్పటికే 50 ప్రభుత్వ ఐటీఐలను గుర్తించామని అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు భారీ న్యూ ఇయర్ కానుక.. 27,370 ఉద్యోగాలకు నోటిఫికేషన్!

Advertisment
తాజా కథనాలు