APPSC Jobs: ఏపీలోని నిరుద్యోగులను అదిరిపోయే శుభవార్త.. ఏపీపీఎస్సీ నుంచి 6 నోటిఫికేషన్లు!

ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసినట్లు ఏపీపీఎస్సీ సభ్యుడు పరిగె సుధీర్ ట్వీట్ చేశారు. మొత్తం ఆరు నోటిఫికేషన్లను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్లో 31పోస్టులకు భర్తీ చేస్తున్నట్లు వెల్లడించారు.

New Update
APPSC Jobs: ఏపీలోని నిరుద్యోగులను అదిరిపోయే శుభవార్త.. ఏపీపీఎస్సీ నుంచి 6 నోటిఫికేషన్లు!

APPSC Jobs: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసినట్లు ఏపీపీఎస్సీ సభ్యుడు పరిగె సుధీర్ ట్వీట్ చేశారు. మొత్తం ఆరు నోటిఫికేషన్లను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 18 పోస్టులు, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీసులో 7పోస్టులు, మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీసులో 4 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ సర్వీసులో 1 పోస్టుల, సీనియర్ సిటిజన్ సర్వీసెస్ లో 1 పోస్టు, గ్రౌండ్ వాటర్ సర్వీసెస్ లో 1 పోస్టు ఉన్నట్లు వెల్లడించారు.

కాగా అటు మెగా డీఎస్సీకి ఏపీ కేబినెట్ (AP Cabinet) ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. 6,100 పోస్టులను భర్తీ చేయడానికి కేబినెట్ ఓకే చెప్పగా..తాజాగా డీఎస్సీ నోటిఫికేషన్ ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 12 నుంచే పరీక్షలకు అప్లికేషన్ ఫామ్‌లను కూడా తీసుకోనున్నారు. ఈ నెల 22 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఏప్రిల్ 7న ఫలితాలు ప్రకటిస్తారు. 

విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఏం అన్నారంటే :

–> ఏపిలో ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్

–> ఫిబ్రవరి 12 తేదీ నుంచి 22 వరకు దరఖాస్తుల స్వీకరణ..

–> టెట్ పరీక్ష ఈ నెల 27 నుంచి మార్చి 9 వరకు

–> మార్చి 5న హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే ఆప్షన్

–> మార్చి 14న టెట్ రిజల్ట్

–> మార్చి 15 నుంచి మార్చి 30 వరకు డీఎస్సీ పరీక్షలు

–> మార్చి 31న డీఎస్సీ ప్రాధమిక కీ విడుదల

–> ఏప్రిల్ 2న ఫైనల్ కీ

–> ఏప్రిల్ 7న ఫలితాల ప్రకటన

–> అన్ని యాజమాన్యాల కింద ఉన్న పాఠశాలలోని ఖాళీలను భర్తీ

–> 6100 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం

–> ఫిబ్రవరి 12 తేదీ నుంచి ప్రక్రియ మొదలై ఏప్రిల్ 7 తేదీన ఫలితాలు వెల్లడి..

–> 2280 ఎస్జీటీ పోస్టులను

–> 2299 స్కూల్ అసిస్టెంట్ లు

–> 1264 టీజీటి .

–> 215 పిజిటి లు

–> 242 ప్రిన్సిపాల్ నియామకం

12 ఏళ్ళ క్రితం తొలగించిన అప్రెంటీస్‌షిప్ విధానాన్ని ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రవేశపెట్టనున్నారు. దీని ప్రకారం డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులు రెండేళ్ళపాటూ గౌరవవేతనానికి పని చేయాల్సి ఉంటుంది. అప్రెంటీస్‌షిప్‌లో ఉన్నప్పుడు ఎవరైనా ఏపీ ఉద్యోగుల నిబంధనలను పాటించకపోతే వారి అప్రెంటీస్‌షిప్‌ను పొడిగిస్తారు. అలాగే ఈసారి డీఎస్సీ, టెట్ (TET) ఎగ్జామ్స్‌ను కంప్యూటర్ ఆధారిత పరీక్షలుగా (Computer Based Exam) నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఏపీ విద్యాశాఖ టీసీఎస్‌తో (TCS) ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు సమాచారం.

ఐదేళ్ళల్లో ఇదే మొదటిసారి..

నిజానికి ఏపీలో వైసీపీ (YCP) అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్‌(DSC Notification) కూడా విడుదల చేయలేదు. 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్న జగన్‌ (CM Jagan) ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 25 వేల ఉపాధ్యాయ పోస్టుల (Teacher Posts) భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయకుంటే సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని గతేడాది ఆగస్టులో ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ హెచ్చరించింది. ఇక ఎన్నికలకు మరి కొన్ని నెలలే టైమ్‌ ఉండడంతో ప్రభుత్వం మెగా డీఎస్సీ (AP Mega DSC) విడుదల చేయకుంటే డీఎస్సీ అభ్యర్థుల నుంచి తిరుగుబాటు తప్పదన్న అభిప్రాయాలు వినిపించాయి. ఇటు ప్రతిపక్షం టీడీపీ సైతం ఇదే విషయంలో వైసీపీని కార్నర్ చేస్తూ వచ్చింది. ఇది అధికార పార్టీపై ప్రతికూల ప్రభావం చూపిందని విశ్లేషణలు వినిపించాయి. దీంతో నిరుద్యోగ యువతను తమవైపునకు తిప్పుకునేందుకు జగన్ సర్కార్ డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఏది ఏమైనా డీఎస్సీకి రాష్ట్ర కేబినెట ఆమోదం తెలపడం..నోటిఫికేషన్ కూడా విడుదల అవుతుండండతో అభ్యర్ధులు, నిరుద్యోగులు రిలాక్స్ అవుతున్నారు. పరీక్షల ప్రిపరేషన్ కోసం సిద్ధం అవుతున్నారు.

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG TET 2025: టీజీ టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలు ఎప్పట్నుంచంటే?

తెలంగాణ టెట్‌ 2025 పరీక్షల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. జూన్ 18 నుంచి 30 వరకు రెండు షిఫ్ట్‌ల్లో పేపర్ 1,2 పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఒక షిఫ్ట్‌, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు మరో షిఫ్ట్‌లో జరుగుతాయి.

New Update
TG TET 2025

TG TET 2025

తెలంగాణ టెట్‌ 2025 (TG TET 2025) పరీక్షల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఈ పరీక్షలు జూన్ 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రెండు షిఫ్ట్‌ల్లో పరీక్షలు జరగనున్నాయి. వీటిని పేపర్ 1, పేపర్ 2గా విభజించారు. కాగా జూన్ 15 నుంచి పరీక్షలు నిర్వహిస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొన్నప్పటికీ జూన్ 18 నుంచి నిర్వహిస్తుండటం గమనార్హం. 

ఈ లింక్ క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి - https://tgtet.aptonline.in/tgtet/

రెండు షిఫ్ట్‌లలో

ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఒక షిఫ్ట్‌, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు మరో షిఫ్ట్‌లో పరీక్షలు జరుగుతాయి. కాగా ఏప్రిల్‌ 15 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరించారు. జూన్‌ 9 నుంచి హాల్‌టికెట్లు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది.

పరీక్ష పేపర్లు ఇంగ్లీష్, తెలుగు మాధ్యమాల్లో ఉంటాయి. కొన్ని సబ్జెక్టులకు హిందీ, కన్నడ, తమిళం, మరాఠీ, ఉర్ధూ, బెంగాలీ, సంస్కృతం మాధ్యమాల్లో అవకాశం ఇచ్చారు. 

Also Read: ఫలించిన 18 ఏళ్ళ నిరీక్షణ..మిన్నంటిన ఆర్సీబీ సంబరాలు

ఈ టెట్ పరీక్షలు మొదటగా మాథమెటిక్స్ అండ్ సైన్ (పేపర్ -2) పరీక్షతో స్టార్ట్ అవుతాయి. 16 సెషన్లలో వివిధ సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహిస్తారు. చివరి రోజు మైనారిటీ భాషలో పేపర్2 మాథమెటిక్స్, సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. 

Also Read: ఈ సాలా కప్ నమ్దే..18 ఏళ్ళ కల... బెంగళూరు రాయల్ విన్నింగ్

పరీక్షా కేంద్రాలు

ప్రతి జిల్లాలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్, వరంగల్, సిరిసిల్ల, మంచిర్యాల, ములుగు, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్, జగిత్యాల, పటాన్‌చెరు, సంగారెడ్డి వంటి జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాగా 1,83,653 దరఖాస్తులు వచ్చాయి. అందులో పేపర్‌ 1కు 63,261మంది, పేపర్‌-2కు 1,20,392మంది దరఖాస్తు చేసుకున్నారు. 

Also Read: కెప్టెన్ మారాడు కథ మారింది..

Advertisment
Advertisment