ఏపీలో పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది జగన్ సర్కార్. రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన ఉచిత కార్పొరేట్ వైద్యం అందించేందుకు సీఎం జగన్ మరో గొప్ప మైలురాయికి శ్రీకారం చుట్టారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి మరిన్ని మెరుగులు దిద్దారు. దీనిని మరింత బలోపేతం చేసే కార్యక్రమాన్ని నేడు లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ పథకం కింద ఇప్పటి నుంచి రూ. 25లక్షల వరకు ఫ్రీగా వైద్యం అందించే కార్యక్రమంతోపాటు సరికొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల జారీని కూడా సీఎం తన క్యాంపు కార్యాలయం నుంచి నేడు ప్రారంబిస్తారు.
పూర్తిగా చదవండి..AP Govt: ఏపీలోని పేదలకు శుభవార్త.. ఆ స్కీం బెనిఫిట్స్ రూ.25 లక్షల వరకు పెంపు.. నేడు ప్రారంభించనున్న సీఎం జగన్!
ఏపీలోని నిరుపేదలకు శుభవార్త. నేటి నుంచి ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను ఇంటింటికి పంపిణీ చేయనున్నారు. ప్రతి ఇంట్లో ఒకరి ఫోన్లో ఆరోగ్య శ్రీ యాప్ డౌన్ లోడ్ అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఈ పథకం కింద రూ. 25లక్షల వరకు ఫ్రీగా వైద్యం అందిస్తుంది సర్కార్.
Translate this News: