Tirupati: తిరుపతి వెళ్లే భక్తులకు శుభవార్త...!!

ఏడుకొండల్లో కొలువైన శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది సుదూర ప్రాంతాల నుంచి తిరుమలకు వస్తుంటారు. వివిధ మార్గాల్లో తిరుమల చేరుకునే భక్తులు ఆ ఏడు కొండలవారిని దర్శించుకుని పులకించిపోతారు. అయితే నడకమార్గంలో పులల సంచారంతో భక్తులు భయాందోళనకు గురవుతున్న విషయం తెలిసిందే.

Tirupati: తిరుపతి వెళ్లే భక్తులకు శుభవార్త...!!
New Update

ఏడుకొండల్లో కొలువైన శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది సుదూర ప్రాంతాల నుంచి తిరుమలకు వస్తుంటారు. వివిధ మార్గాల్లో తిరుమల చేరుకునే భక్తులు ఆ ఏడు కొండలవారిని దర్శించుకుని పులకించిపోతారు. అయితే నడకమార్గంలో పులల సంచారంతో భక్తులు భయాందోళనకు గురవుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్ 22వ తేదీన అనంతపురం జిల్లాకు చెందిన కౌశిక్ అనే బాలుడిపై చిరుత దాడి చేసింది. కానీ ఆ బాలుడు చిరుత దాడి నుంచి తప్పించుకుని మృత్యుంజయుడై బయటపడ్డాడు.

అయితే ఇదే ఏడాది ఆగస్టు 12వ తేదీన అలిపిరి మెట్ల మార్గంలో తన తల్లిదండ్రులతో కలిసి వెళ్తున్న లాక్షిత అనే చిన్నారిపై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో చిన్నారి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో టీటీడీ అలర్టయ్యింది. నడకదారిన వెళ్లే భక్తులను అప్రమత్తం చేసింది. అయినా కడా తిరుమలకు మెట్ల మార్గంలో వెళ్లేందుకు కూడా భక్తులు జంకుతున్నారు.

ఇది కూడా చదవండి: వినియోగదారులకు షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే?

కాలినడకన తిరుమలకు వెళ్తున్న భక్తులు, మొదటి ఘాట్ రోడ్డులో చాలాసారు చిరుతలు కనిపించాయి. చిరుతలను చూసినట్లుగా టీటీడీ విజిలెన్స్ అధికారులకు తెలిపారు. దీంతో ఘాట్ రోడ్డులతోపాటు నడకదారిలోనూ అధికారులు ఆంక్షలు విధించారు. భక్తులు గుంపులుగా వెళ్లాలని టీటీడీ సూచించింది. మధ్యాహ్నం నడక దారిలో వెళ్లే భక్తులకు ఉతకర్రను ఇస్తూ వారిలో మనోధైర్యాన్ని నింపుతోంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత అలిపిరి మెట్ల మార్గంలో 12ఏళ్ల లోపు చిన్నారులను అనుమతించడం లేదు. ఘాట్ రోడ్డులో ద్విచక్రవాహనాలకు కూడా ఆంక్షలు విదించారు. ఉదయం 6గంటలనుంచి సాయంత్రం 6గంటల వరకు మాత్రమే టూవీలర్స్ కు అనుమతిస్తున్నారు.

ఇది కూడా చదవండి: మహిళలు గుడ్‎న్యూస్…భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు..!

నడకమార్గంలో ట్య్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. చిరుత జాడలను గుర్తిస్తున్నారు. రెండు నెలల వ్యవధిలోనే ఆరు చిరుతలను బంధించారు. దీంతో మెట్ల మార్గంలో చిరుతల సంచారం తగ్గింది. వారం రోజులుగా చిరుతల సంచారం నమోదు కాలేదు. దీంతో శ్రీవారి భక్తులకు స్వల్ప ఉపశమాన్ని కల్పిస్తోంది టీటీడీ. టూవీలర్ పై తిరుమలకు వెళ్లే భక్తులకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది టీటీడీ. ఎప్పటిలాగే ఉదయం 5గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఘాట్ రోడ్డులో టూవీలర్ కు అనుమతి ఇచ్చింది. దీంతో దూరప్రాంతాల నుంచి టూవీలర్ పై తిరుమలకు వచ్చే భక్తులకు ఇది శుభవార్తే.

#tirupati #two-wheelers #restrictions
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe