రేపటి నుంచి గోల్కొండ బోనాలు

బోనాల రాకతో హైద‌రాబాద్ నగ‌రం సుంద‌రంగా ముస్తాబైయింది. రేప‌టి నుంచి ప్రారంభంకానున్న బోనాలు ఉత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హిచేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. నెల రోజుల పాటు జరిగే బోనాల జాత‌రలో ఎటువంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌రగ‌కుండా ఏర్పాట్లు చేయాల‌ని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

New Update
రేపటి నుంచి గోల్కొండ బోనాలు

Golconda bonas from tomorrow

రేపే ప్రారంభం

హైద‌రాబాద్ నగ‌రం స‌ర్వాంగ సుంద‌రంగా ముస్తాబ‌వుతోంది. రేప‌టి నుంచి ప్రారంభం కానున్న బోనాలు ఉత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హిచేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. నెల రోజుల పాటు న‌గ‌రంలో జ‌ర‌గ‌నున్న బోనాల జాత‌ర రేపు గోల్కొండ నుంచి ప్రారంభం కానుంది. ఈ బోనాల పండుగ ముందుగా గోల్కొండ బోనాల‌తో ప్రారంభం కానుంది. ఆ త‌ర్వాత సికింద్రాబాద్ మ‌హింకాళి బోనాల‌తో ఊపందుకోనుంది.

అమ్మవారికి పట్టువస్త్రాలు

లంగర్ హౌస్‌లో రేపు మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించే తొట్టెల ఊరేగింపులో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ పాల్గొంటారు. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున‌ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

ఏర్పాట్లపై ఆదేశాలు

బోనాల జాత‌ర‌కు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్ర‌భుత్వం అన్ని విధాలా ఏర్పాట్లు చేస్తోంది. మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ఇప్ప‌టికే ప‌లుమార్లు అధికారుల‌తో సమావేశ‌మై ఏర్పాట్ల‌ను స‌మీక్షించారు. ఎటువంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌రగ‌కుండా జాత‌ర‌కు ఏర్పాట్లు చేయాల‌ని ప‌లు శాఖ‌ల‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

పాతబస్తీలో బోనాలు

జులై 9న సికింద్రాబాద్ మహంకాళి బోనాల ఉత్సవం ప్రారంభం కాగా, జూలై 10న ఊరేగింపు నిర్వహించనున్నారు. పాతబస్తీలో బోనాల ఉత్సవం జూలై 16న ప్రారంభమవుతుందని, మరుసటి రోజు జూలై 17న ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఊరేగింపు నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఉత్సవాలకు ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు కేటాయించిందని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి తెలిపారు. తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా బోనాల పండుగను నిర్వహిస్తామన్నారు.

అమ్మవారికి నైవేద్యాలు

తెలంగాణ  ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా బోనాల పండుగను నిర్వహిస్తోంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా బోనాల పండుగకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పండుగను ఆషాఢ మాసంలో జరుపుకుంటారు. ఈ మాసంలో ఎల్లమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బోనం అంటే అమ్మవారికి సమర్పించే నైవేద్యం. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం మరియు కొన్నిసార్లు ఉల్లిపాయలను మట్టి లేదా రాగి కుండలలో తలపై ఉంచి, ఆలయానికి వెళ్లి కల్లు కొమ్మతో పాటు అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు