50 years of Godavari Express: గోదావరి ఎక్స్ ప్రెస్..ఈ ట్రైన్ పేరు తెలియని తెలుగు వారుండరు. ఈ ట్రైన్ లో ప్రయాణం ఏదో తెలియని అనుభూతినిస్తుంది. ఈ ట్రైన్లో ప్రయాణం ఒక సెంటిమెంట్. ఎన్నో ఆశలతో హైద్రాబాద్ చేరుకోవాలనే వారికి గోదావరి రైలు ప్రయాణం ఒక స్వాంతన నిస్తుంది. ఈ రైలులో ప్రయాణిస్తున్నంత సేపూ తమ సొంత బంధువులతో ప్రయాణిస్తున్న అనుభూతి కలుగుతుంది.తమ గమ్యస్థానాలకు సురక్షితంగా తీసుకొని వెళ్తుందని ఒక నమ్మకాన్నిస్తుంది గోదావరి రైలు. సమయపాలన విషయంలో కానీ , శుభ్రత విషయంలో కానీ ఎక్కడా రాజీపడకుండా .విశాఖపట్నం నుంచి హైద్రాబాద్ వరకు భారత దక్షిణ మద్య రైల్వే ఆధ్వర్యంలో 5 దశాబ్దాలుగా ఎనలేని సేవలను అందించిన ఈ గోదావరి ట్రైన్ తన సేవలను ప్రారంభించి నేటికీ 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది.
పూర్తిగా చదవండి..Visakhapatnam to Hyderabad: 50 యేళ్లు పూర్తి చేసుకున్న గోదావరి ఎక్స్ ప్రెస్
విశాఖపట్నం నుంచి హైద్రాబాద్ వరకు భారత దక్షిణ మద్య రైల్వే ఆధ్వర్యంలో ఎనలేని సేవలను అందించిన గోదావరి ట్రైన్ తన సేవలను ప్రారంభించి నేటికి 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా విశాఖ రైల్వే స్టేషన్లో కేక్ కటింగ్ నిర్వహించి రైల్వే అధికారులు తమ అనందాన్ని వ్యక్తం చేశారు.
Translate this News: