Suryapet Crime : చెట్టుపైనే ఉరేసుకుని గీత కార్మికుని ఆత్మహత్య!

సూర్యాపేట జిల్లాలో తాటి చెట్టు పై ఉరేసుకొని ఓ గీత కార్మికుడు మృతి చెందాడు.ముకుందాపురానికి చెందిన దేశగాని వెంకటేశం(75) రోజులాగే పనిలో భాగంగా కల్లు తీయడానికి శుక్రవారం ఉదయం గ్రామ శివారుకి వెళ్లారు.ఈ క్రమంలోనే తాటి చెట్టు ఎక్కి ఉరేసుకున్నారు.

Suryapet Crime : చెట్టుపైనే ఉరేసుకుని గీత కార్మికుని ఆత్మహత్య!
New Update

Gita Worker Committed To Kill Himself : సూర్యాపేట జిల్లా (Suryapet District) లో తాటి చెట్టు పై ఉరేసుకొని ఓ గీత కార్మికుడు మృతి చెందాడు. మునగాల మండలం ముకుందాపురంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ముకుందాపురానికి చెందిన దేశగాని వెంకటేశం(75) రోజులాగే పనిలో భాగంగా కల్లు తీయడానికి శుక్రవారం ఉదయం గ్రామ శివారుకి వెళ్లారు.

ఈ క్రమంలోనే తాటి చెట్టు ఎక్కి ఉరేసుకున్నారు. గమనించిన గ్రామస్థులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు.

ఇదిలా ఉంటే మృతదేహన్ని కిందకు దించే క్రమంలో అదే గ్రామానికి చెందిన నాగార్జున పై మృతదేహం పడటంతో ఆయన కింద పడిపోయారు. నాగార్జునకు గాయాలు కావడంతో కోదాడలోని ప్రైవేటు ఆసుపత్రి (Kodad Private Hospital) కి తరలించారు. తన భార్య మానసిక పరిస్థితి బాగోలేక పోవడంతో పాటు ఆర్థిక, కుటుంబ, అనారోగ్య సమస్యలతోనే వెంకటేశం ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. మృతుడి బంధువు దేశగాని నరేశ్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు.

Also read: నగరంలో మరో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం!

#killed #munagala #suryapet #gita-worker
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe