కొంతకాలం పోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) లేకుండా ఏ పని జరగని పరిస్థితి వస్తుందేమో.. ఇప్పుడు ఎలాగైతే కంప్యూటర్లు మన నిత్య జీవితంలో భాగమైపోయాయో.. ముందుముందు ఏఐ(AI) కూడా అంతే. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా ఏఐ సేవలను ఎక్కువగా వినియోగించుకోవాలనుకుంటోంది. కొత్త పార్లమెంట్ భవనానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రక్షణగా నిలవనుంది. ఇక ఈ కొత్త భవనం నిర్మాణ నైపుణ్యంలోనే కాదు, ప్రజాస్వామ్య పురోగతికి దర్పణంగా నిలుస్తుందని దేశం మొత్తం కీర్తిస్తున్న వేళ కొత్తగా ‘ఏఐ’ను కూడా బిల్డింగ్లో భాగం చేయడం మెచ్చుకొదగ్గ విషయమేనంటున్నారు విశ్లేషకులు.
పూర్తిగా చదవండి..కొత్త పార్లమెంట్ భవనానికి ‘ఏఐ’తో రక్షణ.. మాములుగా ఉండదు మరి!
అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకున్న కొత్త పార్లమెంట్ భవనానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రక్షణగా నిలవనుంది. పార్లమెంట్ భవనం ఎంట్రీ వద్ద అధునాతన ఫేషియల్ 'ఏఐ' మెకానిజమ్ను ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. ఇక 'స్మార్ట్ కార్డ్' ఆపరేటింగ్ సిస్టమ్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అప్లికేషన్స్ని కూడా ఉపయోగించుకోబోతోంది ప్రభుత్వం. ఈ కార్డు ఉన్న వాళ్లు మాత్రమే బిల్డింగ్లోని నిర్ధిష్ట ప్రాంతాలకు వెళ్లగలరు.
Translate this News: