Breaking: ఘోర అగ్ని ప్రమాదం..ఇన్వర్టర్‌ లో మంటలు రేగి..నలుగురు ఊపిరాడక..!

ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు కుటుంబ సభ్యులు మృతి చెందారు. పొగలో ఊపిరాడక భర్త, భార్య, ఇద్దరు కుమారులు తమ ప్రాణాలు విడిచారు. ఇన్వర్టర్ లో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు.

Breaking: ఘోర అగ్ని ప్రమాదం..ఇన్వర్టర్‌ లో మంటలు రేగి..నలుగురు ఊపిరాడక..!
New Update

Delhi: ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు కుటుంబ సభ్యులు మృతి చెందారు. పొగలో ఊపిరాడక భర్త, భార్య, ఇద్దరు కుమారులు తమ ప్రాణాలు విడిచారు. ఇన్వర్టర్ లో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ దుర్ఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగింది.

ప్రేమ్ నగర్‌ లోని ఓ ఇంట్లో తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. మొదటి అంతస్తులో ఉంచిన ఇన్వర్టర్ లో ముందు మంటలు చెలరేగగా మంటలు సోఫాలోకి చేరాయి. మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో పై అంతస్తులో పొగలు కమ్ముకున్నాయి. ఈ ప్రమాదంలో పై అంతస్తులో నిద్రిస్తున్న కుటుంబం మొత్తం మృతి చెందింది.

అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారిని హీరా సింగ్‌ (48), ఆయన భార్య నీతూ సింగ్‌, కుమారులు రాబిన్‌ సింగ్‌ (22), లక్షయ్‌ (21) గా పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలానికి రెండు అగ్ని మాపక వాహనాలను పంపించారు.మంటల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకుని వచ్చి ఆస్పత్రికి తరలించగా..అప్పటికే నలుగురు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు

Also read: రాత్రి 10.30కే షాపుల మూసివేతపై కీలక అప్డేట్‌!

#delhi #invertor #fire-accident
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe