Former MLA Kethi Reddy: వైసీపీ ఓటమిపై సొంత పార్టీ నేతల సంచలన వ్యాఖ్యలు

AP: వైసీపీ ఓటమిపై ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎంవోకు, ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్‌ వచ్చిందన్నారు. సీఎం ఆఫీస్ ముందు గంటల పాటు వెయిట్ చేయించారని పేర్కొన్నారు. సీఎంకు, ఎమ్మెల్యేలకు సీఎంవో అధికారులు గ్యాప్‌ క్రియేట్‌ చేశారని ఆరోపించారు.

New Update
Former MLA Kethi Reddy: వైసీపీ ఓటమిపై సొంత పార్టీ నేతల సంచలన వ్యాఖ్యలు

Former MLA Kethi Reddy: అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ఓటమిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు సంచలన ఆరోపణలు చేశారు. సీఎంవోలో అధికారులపై తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ధనుంజయ్‌రెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు వైసీపీ నేతలు. మొన్న జక్కంపూడి రాజా, తాజాగా కేతిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జగన్‌ను ధనుంజయ్‌రెడ్డి తప్పుదారి పట్టించారని జక్కంపూడి ఆరోపించారు. మేమిచ్చిన అర్జీలను పట్టించుకోలేదని మండిపడ్డారు. జగన్‌ నమ్మకంతో మేమిచ్చే అర్జీలను ధనుంజయ్‌రెడ్డికి అప్పగిస్తే వాటిలో ఒక్కటి కూడా పరిష్కరించలేదని ఫైర్ అయ్యారు.

సీఎంవోకు, ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్‌ వచ్చిందని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి. మమ్మల్ని గంటలు గంటలు వెయిట్ చేయించారని అన్నారు. మేమిచ్చే అర్జీలను సీఎంవో పట్టించుకోలేదని పేర్కొన్నారు. సీఎంకు, ఎమ్మెల్యేలకు సీఎంవో అధికారులు గ్యాప్‌ క్రియేట్‌ చేశారని ఆరోపించారు. ఐదేండ్లు తిరిగినా సమస్యలను పరిష్కరించలేదని ఫైర్ అయ్యారు.

Advertisment
తాజా కథనాలు