Natwar Singh: మాజీ విదేశాంగ మంత్రి కన్నుమూత!

దేశ మాజీ విదేశాంగ మంత్రి, ప్రముఖ కాంగ్రెస్‌ నాయకుడు నట్వర్‌ సింగ్‌ (95) ఈ ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. సింగ్ ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, యూపీఏ హయాంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ సారథ్యంలో మంత్రిగా పనిచేశారు.

New Update
Natwar Singh: మాజీ విదేశాంగ మంత్రి కన్నుమూత!
Natwar Singh: దేశ మాజీ విదేశాంగ మంత్రి, ప్రముఖ కాంగ్రెస్‌ నాయకుడు నట్వర్‌ సింగ్‌ (95) ఈ ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. నట్వర్ సింగ్ ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, యూపీఏ హయాంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ సారథ్యంలో మంత్రిగా పనిచేశారు.


కేంద్ర మాజీ మంత్రి మృతి పట్ల రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శర్మ.. “నట్వర్ సింగ్ జీ మరణవార్త చాలా బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.” అని తన ట్విటర్‌ ఖాతాలో రాసుకొచ్చారు.


Also Read: గ్రామ సచివాలయాల్లో కీలక మార్పులు…ఇక నుంచి ఆ పేరుతో!

Advertisment
తాజా కథనాలు