Jagan & KCR: డీఎస్ మృతిపై మాజీ సీఎంలు కేసీఆర్, జగన్ సంతాపం

కాంగ్రెస్ నేత శ్రీనివాస్ మృతి పట్ల తెలుగు రాష్ట్రల మాజీ సీఎంలు కేసీఆర్, జగన్ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తన తండ్రి రాజశేఖర్‌ రెడ్డితో డి.శ్రీనివాస్‌‌కి ఉన్న అనుబంధం మరిచిపోలేనిదని గుర్తుచేసుకున్నారు జగన్.

Jagan & KCR: డీఎస్ మృతిపై మాజీ సీఎంలు కేసీఆర్, జగన్ సంతాపం
New Update

Jagan: మాజీ మంత్రి, తెలంగాణకు చెందిన సీనియర్‌ నాయకుడు, పీసీసీ మాజీ అధ్యక్షులు డి. శ్రీనివాస్‌ గారి మరణం పట్ల వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్ సంతాపం తెలిపారు. తన తండ్రి దివంగత వైయస్ రాజశేఖర్‌ రెడ్డితో డి.శ్రీనివాస్‌ గారికి ఉన్న అనుబంధం మరిచిపోలేనిదని గుర్తుచేసుకున్నారు. ఆయన మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నానన్నారు. డి.శ్రీనివాస్‌ గారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

కేసీఆర్ సంతాపం..

మాజీ మంత్రి డి. శ్రీనివాస్ గారి మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

#srinivas
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe