అస్సాంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం నుంచి ప్రారంభమైన వాన…నిరంతరాయంగా కరురుస్తూనే ఉంది. దీంతో పలు పట్టణాలు, గ్రామాలు, పొలాలు నీటమునిగాయి. ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో రెండు రోజుల పాటు అస్సాంలోని పలు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. రాజధాని గుహవాటిలో రానున్న 24గంటల్లో భారీవర్షాలు నమోదు అవుతాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది.
పూర్తిగా చదవండి..అస్సాంను ముంచెత్తిన వరదలు, నిరాశ్రులైన 31వేల మంది, రెడ్ అలర్ట్ జారీ..!!
అస్సాంను వరదలు ముంచెత్తాయి. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో 31వేల మంది నిరాశ్రులయ్యారు. భారీగా వర్షాలు కురుస్తుండటంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న ఐదు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది.

Translate this News: