/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Five-people-died-in-the-cremation-wall-in-Haryana-jpg.webp)
Haryana: హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్లో విషాద ఘటన చోటుచేసుకుంది. శ్మశానవాటిక గోడ కూలి ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. ఆదివారం తెల్లవారుజామున గురుగ్రామ్లోని అర్జున్ నగర్లో నివాసముంటున్న ఓ కుటుంబంపై శ్మశాన వాటిక గోడ కూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో పాటు మరో నలుగురు వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకున్నారు. వీరిని కాపాడేందుకు ప్రయత్నించేలోగా తీవ్రంగా గాయడిన ఏండ్ల తాన్యా, దేవి దయాళ్, మనోజ్గాబా, కృష్ణకుమార్ లు మరనించారు. దీపాప్రదాన్ అనే మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు సఘటనాస్థాలనికి చేరుకున్నారు. పరిస్థితిని పరిశీలించి కేసు నమోదు చేశారు.
#UPDATE | Haryana: Five people died after the walls of a crematorium collapsed on them in Arjun Nagar, Gurugram, yesterday: PRO, Gurugram Police https://t.co/aCypdUDGtU
— ANI (@ANI) April 21, 2024
ఇది కూడా చదవండి: ముంగిసపై పాము విషం ఎందుకు పనిచేయదు.. కారణం ఇదే