America : అమెరికాలో మరోసారి పేలిన తూటా.. ఐదుగురిని కాల్చి చంపిన దుండగుడు!

అమెరికాలో మరోసారి తూటా పేలింది. సోమవారం రాత్రి ఓ దుండగుడు వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఐదుగురు పౌరులు మరణించారు. లాస్‌ వెగాస్‌ కు సమీపంలో జరిగిన ఈ కాల్పుల్లో ఓ బాలిక తీవ్రంగా గాయాలపాలైంది. నిందితుడ్ని ఎరిక్‌ ఆడమ్స్‌ (57) గా అధికారులు గుర్తించారు.

New Update
America : అమెరికాలో మరోసారి పేలిన తూటా.. ఐదుగురిని కాల్చి చంపిన దుండగుడు!

Las Vegas : అమెరికా (America) లో మరోసారి తూటా పేలింది. సోమవారం రాత్రి ఓ దుండగుడు వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఐదుగురు పౌరులు మరణించారు. లాస్‌ వెగాస్‌ కు సమీపంలో జరిగిన ఈ కాల్పుల్లో ఓ బాలిక తీవ్రంగా గాయాలపాలైంది. నిందితుడ్ని ఎరిక్‌ ఆడమ్స్‌ (57) గా అధికారులు గుర్తించారు. అయితే కాల్పులు జరిపిన తరువాత నిందితుడు ఆత్మహత్య (Suicide) కు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.

దుండగుడి కాల్పుల్లో మరణించిన వారిలో ఇద్దరు మహిళల మృతదేహాలను గుర్తించామని, ఒకరి వయసు 40 ఏళ్లు, మరొకరు వయసు 50 ఏళ్లు అని పేర్కొన్నారు. అదే అపార్ట్‌మెంట్‌లో తీవ్రంగా గాయపడిన 13 ఏళ్ల బాలికను కూడా గుర్తించి హాస్పిటల్‌కు తరలించామని చెప్పారు. దర్యాప్తు చేస్తుండగా మరో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడి మృతదేహాలను గుర్తించామని చెప్పారు. మృతులంతా తుపాకీ గాయాలతో చనిపోయారని లాస్ వెగాస్ పోలీసులు తెలిపారు.

కాగా నిందితుడు ఆడమ్స్ కోసం పోలీసులు రాత్రిపూట వేట కొనసాగించారు. ఓ చోట నిందితుడిని గుర్తించిన పోలీసులు అతనిని లొంగిపోవాలని కోరారు. అయితే పోలీసులు సమీపిస్తున్న సమయంలో నిందితుడు తుపాకీతో తనను తాను కాల్చుకొని (Gun Shoot) చనిపోయాడని పోలీసు అధికారులు వివరించారు. ఈ కాల్పులకు కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

Also read: వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఏపీ ఐఏఎస్‌ అధికారి..తెలంగాణ నుంచి..!

Advertisment
తాజా కథనాలు