/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/AIR-TEL-jpg.webp)
భారతీయ మార్కెట్లో రిలయన్స్ జియో, ఎయిర్టెల్ మధ్య తీవ్రమైన పోటీ ఉంది. రెండు కంపెనీలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ అనేక ప్లాన్లను అందిస్తూనే ఉన్నాయి. అది ప్రీపెయిడ్ ప్లాన్ లేదా పోస్ట్పెయిడ్ లేదా ఏదైనా ఫైబర్ ప్లాన్ అయినా, అన్నీ విభిన్న ధరలు, ఫీచర్లతో ఒకదానితో ఒకటి పోటీపడతాయి. ఈసారి భారతీ ఎయిర్టెల్ తన ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ ఎయిర్ఫైబర్ కొత్త ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఇది 5G ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ (FWA)తో తీసుకువచ్చింది. Airtel Xstream AirFiber ప్లాన్ గురించి వివరంగా తెలుసుకుందాం.
ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ ఎయిర్ఫైబర్ వినియోగదారుల కోసం రూ.799కి ప్రారంభించింది. ఈ మొత్తంలో, వినియోగదారు 100Mbps వేగంతో ఇంటర్నెట్ సర్వీస్ ప్రయోజనాన్ని పొందుతారు. ప్లాన్లో అపరిమిత ఇంటర్నెట్ డేటా సౌకర్యం అందిస్తుంది. . అయితే, కొత్త ఎక్స్స్ట్రీమ్ ఎయిర్ఫైబర్ సేవను పొందేందుకు వినియోగదారులు రూ.2,500 సెక్యూరిటీ మొత్తంగా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
లభ్యత గురించి తెలుసుకుంటే.. Airtel యొక్క కొత్త Xstream AirFiber ప్లాన్ 799 భారతదేశంలోని అనేక నగరాల్లో అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఇది ఢిల్లీ, ముంబై నగరాల్లో అందుబాటులోకి వచ్చింది. కంపెనీ క్రమంగా ఈ ప్లాన్ని త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ప్లాన్తో దేశంలోనే మొట్టమొదటి 5G వైర్లెస్ Wi-Fi సర్వీస్ ప్రారంభమైంది. ఇది ఇంటర్నల్ Wi-Fi 6 టెక్నాలజీతో వస్తుంది.
ఎలా సెటప్ చేయాలి?
Airtel Xstream AirFiberని సెటప్ చేయడానికి, AirFiber రూటర్ Airtel స్టోర్ నుంచి కొనుగోలు చేయాలి. యాప్ ద్వారా AirFiber పరికరాన్ని సరైన స్థలంలో సెట్ చేయండి. పరికరాన్ని కనెక్ట్ చేయడానికి QR కోడ్ని స్కాన్ చేయడం ద్వారా Wi-Fi పేరును సెలక్ట్ చేసుకోండి.
స్పెసిఫికేషన్స్:
Airtel Xstream Airfiber భారతదేశంలో మొట్టమొదటి 5G వైర్లెస్ Wi-Fi. ఈ ప్లగ్-అండ్-ప్లే డివైస్ ఇంటర్నల్ Wi-Fi 6 టెక్నాలజీని కలిగి ఉంది. ఈ ప్లాన్ స్పెషాలిటీ ఏంటంటే.. ఏకకాలంలో 64 డివైజ్ లకు కనెక్ట్ చేసుకోవచ్చు. లుక్ పరంగా.. ఇది 2022లో ప్రారంభించిన Jio AirFiber లాగా కనిపిస్తోంది.