Fire Accident: మంటల్లో చిక్కుకున్న ఇల్లు.. ఐదుగురి మృతి!

ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ జిల్లాలోని బెహతా హాజీపూర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఒక ఇంట్లో మంటలు అంటుకోవడంతో ఏడుగురు వ్యక్తులు చిక్కుకున్నారు. అందులో ఐదుగురు అక్కడిక్కడే మరణించారు. గాయపడిన ఒక మహిళ, ఒక చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. 

New Update
Fire Accident: మంటల్లో చిక్కుకున్న ఇల్లు.. ఐదుగురి మృతి!

Fire Accident: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఓ మహిళ, చిన్నారి గాయపడినట్లు అదనపు పోలీసు కమిషనర్ దినేష్ తెలిపారు. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు 

మొదట కింది అంతస్తులో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత పై అంతస్తుకు మంటలు వ్యాపించాయని పోలీసులు తెలిపారు. దీంతో మొదటి, రెండో అంతస్తుల్లో ఉన్న వారికి కూడా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో 5 మంది ప్రాణాలు కోల్పోగా, వారిని గుర్తించి ఆరా తీస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోందని పోలీసులు చెప్పారు. 

ప్రమాద సమయంలో ఏడుగురు..
Fire Accident: ఘజియాబాద్‌ జిల్లాలోని లోని బెహతా హాజీపూర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.  ఈ  ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో మొత్తం ఏడుగురు ఉండగా, ఒక చిన్నారి, ఒక మహిళను రక్షించారు. అయితే, మహిళ కూడా మంటల్లో గాయాల బారిన పడింది. పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.  అగ్నిప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు కూడా మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

Also Read: ఘోర అగ్నిప్రమాదం.. 40 మంది భారతీయులు మృతి

కొనసాగుతూన్న కేసు దర్యాప్తు..
Fire Accident: సమాచారం ప్రకారం.. ఇస్తియాక్ (70) తన కుటుంబంతో కలిసి బెహతా హాజీపూర్‌లో నివసిస్తున్నాడు. బుధవారం రాత్రి మంటలు చెలరేగడంతో ఇష్తియాక్‌, అతని మరో కుమారుడు సారిక్‌ బయట ఉండగా, మరికొందరు ఇంట్లో ఉన్నారు. అర్థరాత్రి కింది అంతస్తులో మంటలు చెలరేగడంతో మొదటి, రెండో అంతస్తుల్లో ప్రజలు చిక్కుకుపోయారు.

ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు..
దీనిపై విచారణ జరుపుతున్నట్లు అదనపు పోలీసు కమిషనర్ దినేష్ కుమార్ తెలిపారు. ఇంట్లో అగ్నిప్రమాదం జరిగినట్లు అర్థరాత్రి సమాచారం అందిందని దినేష్‌కుమార్‌ తెలిపారు. గాయపడిన ఓ చిన్నారి, మహిళను ఆసుపత్రిలో చేర్చినట్లు ఆయన తెలిపారు.

Advertisment
తాజా కథనాలు