Fire Accident: సంగారెడ్డిలో ఘోర అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు..

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్టోరేజీ విభాగంలో కెమికల్ డ్రమ్స్ నిల్వ ఉంచడంతో ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం. ఘటనాస్థలానికి చేరుకున్న ఆరు అగ్నిమాపక శకటాలు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి.

Fire Accident:  సంగారెడ్డిలో ఘోర అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు..
New Update

సంగారెడ్డి జిల్లా పటాచెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఎంఎస్‌ఎస్‌ రెండో యూనిట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే స్టోరేజీ విభాగంలో కెమికల్ డ్రమ్స్‌ నిల్వ ఉంచడంతో ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రసాయన డ్రమ్ములు పేలడంతో మంటలు పెద్దఎత్తున వ్యాపించాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక శకటాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. మంటలు ఆర్పేందుకు ఆరు అగ్నిమాపక శకటాలతో సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడు స్టోర్‌లో ఎంతమంది కార్మికులు ఉన్నారనేదానిపై ఇంకా స్పష్టత అనేది లేదు. అయితే రసాయన డ్రమ్ములు పేలడంతో మంటలు అదపు చేయడం అగ్నిమాపక సిబ్బందికి కష్టతరంగా ఉంది. ప్రమాదం ఎక్కువ కాకుండా సంభవించిన విభాగం నుండి రసాయన డ్రమ్ములు కార్మికులు బయటికి తీసుకువచ్చారు. ఒక్కసారిగా డ్రమ్ముల పేలి మంటలు చెలరేగడంతో కార్మికులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు.

Also Read: వారే నాపై కుట్ర చేసి ఐటీ దాడులు చేశారు.. వివేక్‌ సంచలన ఆరోపణలు..

#telugu-news #telangana-news #fire-accident
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe