Crime News: వేలికి చేయాల్సిన సర్జరీ నాలుకకు చేశాడు.. చివరికి ఏం జరిగిందంటే..?

కేరళలోని కోజికోడ్ మెడికల్ కాలేజీలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ డాక్టర్ చిన్నారి వేలికి చేయాల్సిన సర్జరీని నాలుకకు చేశాడు. రంగంలోకి దిగిన మంత్రి వీణా జార్జ్ బాధ్యుడైన డాక్టర్ బిజోన్ జాన్సన్‌ను సస్పెండ్ చేశారు. వైద్యుడిపై పోలీసు కేసు నమోదు చేశారు.

Crime News: వేలికి చేయాల్సిన సర్జరీ నాలుకకు చేశాడు.. చివరికి ఏం జరిగిందంటే..?
New Update

Kerala: ఓ డాక్టర్ చిన్నారి వేలికి చేయాల్సిన సర్జరీని నాలుకకు చేశాడు. ఈ షాకింగ్ ఘటన కేరళలోని కోజికోడ్ మెడికల్ కాలేజీలో చోటుచేసుకుంది. బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైద్యుడిపై ఐపీసీ 336, 337 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అసలేం జరిగిందంటే..

Also Read: రోజుకు ఎన్నిసార్లు స్నానం చేయాలి? వేడి నీరు నిజంగా మంచిదేనా?

ఓ బాలిక ఆరో వేలు తొలగించుకునేందుకు హాస్పిటల్‌లో అడ్మిట్ అయింది. అయితే, ఆపరేషన్‌ థియేటర్‌ నుంచి బయటకు వచ్చిన బాలికను చూసి ఒక్కసారిగా కుటుంబసభ్యులు షాక్ అయ్యారు. వేలికి చేయాల్సిన ఆపరేషన్‌ నాలుకకు చేయడంతో వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. వైద్యుడి నిర్లక్ష్యంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Also Read: స్టార్ నటి ఇంట్లో పోర్న్ మూవీ షూటింగ్.. ఆధారాలతో బయటపెట్టిన సింగర్!

కాగా, ఇద్దరు పిల్లలకు ఒకే రోజు శస్త్ర చికిత్సలు జరగాల్సి ఉండడంతో ఈ పొరపాటు జరిగిందని ఆసుపత్రి అధికారులు తమకు చెప్పారంటున్నారు కుటుంబ సభ్యులు. ఘటనపై రంగంలోకి దిగిన మంత్రి వీణా జార్జ్ బాధ్యుడైన డాక్టర్ బిజోన్ జాన్సన్‌ను సస్పెండ్ చేశారు.

#kerala
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe