Crime News: వేలికి చేయాల్సిన సర్జరీ నాలుకకు చేశాడు.. చివరికి ఏం జరిగిందంటే..? కేరళలోని కోజికోడ్ మెడికల్ కాలేజీలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ డాక్టర్ చిన్నారి వేలికి చేయాల్సిన సర్జరీని నాలుకకు చేశాడు. రంగంలోకి దిగిన మంత్రి వీణా జార్జ్ బాధ్యుడైన డాక్టర్ బిజోన్ జాన్సన్ను సస్పెండ్ చేశారు. వైద్యుడిపై పోలీసు కేసు నమోదు చేశారు. By Jyoshna Sappogula 17 May 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Kerala: ఓ డాక్టర్ చిన్నారి వేలికి చేయాల్సిన సర్జరీని నాలుకకు చేశాడు. ఈ షాకింగ్ ఘటన కేరళలోని కోజికోడ్ మెడికల్ కాలేజీలో చోటుచేసుకుంది. బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైద్యుడిపై ఐపీసీ 336, 337 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అసలేం జరిగిందంటే.. Also Read: రోజుకు ఎన్నిసార్లు స్నానం చేయాలి? వేడి నీరు నిజంగా మంచిదేనా? ఓ బాలిక ఆరో వేలు తొలగించుకునేందుకు హాస్పిటల్లో అడ్మిట్ అయింది. అయితే, ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన బాలికను చూసి ఒక్కసారిగా కుటుంబసభ్యులు షాక్ అయ్యారు. వేలికి చేయాల్సిన ఆపరేషన్ నాలుకకు చేయడంతో వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. వైద్యుడి నిర్లక్ష్యంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. Also Read: స్టార్ నటి ఇంట్లో పోర్న్ మూవీ షూటింగ్.. ఆధారాలతో బయటపెట్టిన సింగర్! కాగా, ఇద్దరు పిల్లలకు ఒకే రోజు శస్త్ర చికిత్సలు జరగాల్సి ఉండడంతో ఈ పొరపాటు జరిగిందని ఆసుపత్రి అధికారులు తమకు చెప్పారంటున్నారు కుటుంబ సభ్యులు. ఘటనపై రంగంలోకి దిగిన మంత్రి వీణా జార్జ్ బాధ్యుడైన డాక్టర్ బిజోన్ జాన్సన్ను సస్పెండ్ చేశారు. #kerala మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి