Pregnancy: పెళ్లై రెండేళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టకపోవడంతో ఓ మహిళ తాను గర్భం దాల్చినట్లుగా కుటుంబ సభ్యులను నమ్మించిన సంఘటన తెలంగాణలోని జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. ఇరుగుపొరుగు మాటలు భరించలేక పాలకుర్తి మండలంలోని మొండ్రాయి తండాకు చెందిన ధరావత్ పల్లవి అనే వివాహిత తాను ప్రెగ్నెంట్ అంటూ 9 నెలలుగా నకిలీ గర్భంతో అందరిని నమ్మించి చివరికి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. తొమ్మిది నెలలు నిండగానే నొప్పులు వస్తున్నాయంటూ జనగామ ఎంసీహెచ్ ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. ఈ క్రమంలోనే మల విసర్జనకు వెళ్లిన పల్లవి.. అరగంట తర్వాత బయటకు వచ్చి బాత్రూంలో అబార్షన్ అయిందని చెప్పింది. అయితే బాబు బయటపడగానే డ్రైనేజీలోకి జారిపోయాడంటూ కన్నీటి పర్యంతమైంది.
పూర్తిగా చదవండి..Fake pregnancy: 9 నెలల నకిలీ గర్భం.. బాత్రూమ్లో అబార్షన్.. కంగుతిన్న డాక్టర్లు!
తెలంగాణ జనగామ జిల్లాకు చెందిన పల్లవి అనే వివాహిత 9 నెలలుగా నకిలీ గర్భంతో అందరిని నమ్మించి చివరికి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఆస్పత్రిలో చేరిన పల్లవి బాత్రూమ్ లోనే అబార్షన్ కావడంతో మగబిడ్డ డ్రైనీజీలో జారిపోయిందంటూ డ్రామా ఆడింది. పిల్లలు పుట్టట్లేదనే ఇలా చేసినట్లు తెలిపింది.
Translate this News: