Medaram Jathara: తెలంగాణలో నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా సాగిన సమ్మక్క – సారలమ్మ జాతర భక్తుల మొక్కుల మధ్య ఘనంగా ముగిసింది. దాదాపు కోటిన్నరకు పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న భక్తులు సమర్పించిన కానుకల హుండీలను అధికారులు లెక్కిస్తున్నారు. మేడారంలో మొత్తం 518 హుండీలను ఏర్పాటు చేయగా వాటిని హనుమకొండలోని టీటీడీ కళ్యాణమండపలో లెక్కిస్తున్నారు. దాదాపు 10 రోజులపాటు ఈ లెక్కింపు కార్యక్రమం జరగనుంది. డబ్బులు లెక్కిస్తున్న సమయంలో లభించిన కరెన్సీని అధికారులు అవాక్కయ్యారు. కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ ఫొటోకు బదులు డా.బిఆర్.అంబేడ్కర్ ఫొటో ఉండంతో అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
పూర్తిగా చదవండి..Medaram Jathara: మేడారం హుండీ లెక్కింపు.. బయటపడ్డ 100 రూపాయల అంబేడ్కర్ నోటు
మేడారం మహాజాతర హుండీ లెక్కింపులో నకిలీ కరెన్సీ నోట్లు రావడం కలకలం రేపింది. ఓ హుండీలో అంబేడ్కర్ ఫొటోతో నకిలీ రూ.100 నోట్లు కనిపించాయి. భారత కరెన్సీపై అంబేడ్కర్ ఫోటోను ముద్రించాలన్న డిమాండ్తో ఆ నోట్లను కొందరు హుండీలో వేసినట్లుగా అధికారులు భావిస్తున్నారు.
Translate this News: