EX Model Murder: హోటల్‌ లో మాజీ మోడల్‌ హత్య..మృతదేహంతో పారిపోయిన నిందితుడు!

గురుగ్రామ్ లోని ఓ హోటల్ లో మాజీ మోడల్‌ దివ్య పహుజాను ఆ హోటల్‌ యజమాని అభిజిత్‌ మరో వ్యక్తితో కలిసి దారుణంగా హత్య చేశాడు. ఆమె మృతదేహన్ని దుప్పటిలో చుట్టి అక్కడ నుంచి పారిపోతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. దీని ఆధారంగా పోలీసులు నిందితున్ని అరెస్ట్‌ చేశారు.

New Update
EX Model Murder: హోటల్‌ లో మాజీ మోడల్‌ హత్య..మృతదేహంతో పారిపోయిన నిందితుడు!

గురుగ్రామ్ లోని ఓ హోటల్‌ లో మాజీ మోడల్‌ 27 సంవత్సరాల దివ్య పహుజా దారుణ హత్యకు గురైంది. ప్రస్తుతం ఈ హత్య సంచలనం సృష్టించింది. ఈ హత్యలో హోటల్‌ యజమానే ప్రధాన నిందితుడు కావడం గమనర్హం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జనవరి 2 వ తేదీన హోటల్ కి అభిజిత్‌, దివ్య పహుజా, మరో వ్యక్తి కలిసి వచ్చారు.

వారు గది నంబర్‌ 11కి వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. అదే రోజు రాత్రి అభిజిత్‌ తో పాటు మరో వ్యక్తి కలిసి దివ్య మృతదేహాన్ని ఓ దుప్పటి లో చుట్టి గది నుంచి బయటకు లాక్కెళ్లడం కనిపిస్తుంది. ఆ తరువాత నీలిరంగు బీఎమ్ డబ్ల్యూ కారులో అక్కడ నుంచి పారారవ్వడం కనిపించింది.

హోటల్‌ యజమాని అభిజిత్‌ తన సహచరులతో కలిసి ఈ హత్యకు పాల్పడ్డాడని, ఆ తరువాత ఆమె మృతదేహాన్ని మాయం చేయడానికి తన అనుచరులకు సుమారు 10 లక్షల రూపాయలు కూడా చెల్లించినట్లు పోలీసులు కనుగొన్నారు. దీంతో అభిజిత్‌ ని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.

గురుగ్రామ్‌ పోలీసులు సీసీ టీ వీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు మొదలు పెట్టారు. పోలీసు బృందాలతో పాటు క్రైమ్‌ బ్రాంచ్‌ కి చెందిన అనేక బృందాలు కూడా పంజాబ్‌ తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా గాలింపు చర్యలు చేపట్టి మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. దివ్య పహుజా కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుల పై కేసు నమోదు చేశారు.

2016 లో గ్యాంగ్‌ స్టర్‌ సందీప్‌ గడోలీ ఎన్‌కౌంటర్‌ కేసులో దివ్య కూడా ప్రధాన నిందితురాలు..దీంతో అభిజిత్‌ తో పాటు గ్యాంగస్టర్‌ సందీప్‌ సోదరి సుదేష్‌ కటారియా, సోదరుడు బ్రహ్మ ప్రకాష్‌ కలిసి ఆమెను హత్య చేసినట్లు ఆరోపిస్తున్నారు.

Also read: జనరల్‌ సులేమాన్‌ సమాధి వద్ద ఉగ్రదాడి… 70 మంది మృతి..!

Advertisment
తాజా కథనాలు