MLA KTR: రేపు ఎమ్మెల్సీ కవితతో కేటీఆర్ భేటీ

సీబీఐ అదుపులో ఉన్న తన సోదరి, ఎమ్మెల్సీ కవితను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లనున్నారు మాజీ మంత్రి కేటీఆర్. రేపు సాయంత్రం కవితతో కేటీఆర్ భేటీ కానున్నారు. ప్రతి రోజు ఒక గంట పాటు కవితను కుటుంబ సభ్యులు కలిసేందుకు కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే.

MLA KTR: రేపు ఎమ్మెల్సీ కవితతో కేటీఆర్ భేటీ
New Update

MLA KTR: రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు మాజీ మంత్రి కేటీఆర్. సీబీఐ కస్టడీలో ఉన్న తన సోదరి ఎమ్మెల్సీ కవితతో భేటీ కానున్నారు. కస్టడీ సమయంలో ఈరోజు ఒక గంట పాటు కవితను కుటుంబ సభ్యులు కలిసేందుకు కోర్టు అనుమతించింది. ప్రస్తుతం సీబీఐ ప్రధాన కార్యాలయంలో అధికారులు కవితను ఎక్సైజ్ పాలసీ కేసులో విచారిస్తున్నారు. రేపు సాయంత్రం కవితను కేటీఆర్ కలవనున్నారు.

కవితకు ఊహించని షాక్..

సీబీఐ అరెస్ట్ ను సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన రౌస్ అవెన్యూ కోర్టు.. ఆ పిటిషన్ ను కొట్టేసింది. కవితను సీబీఐ విచారించేందుకు అనుమతించింది. ఈ నెల 15 వరకు మూడు రోజుల సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ తీర్పు వెల్లడించింది. కాగా.. ఎక్సైజ్ పాలసీ కేసులో విచారించేందుకు ఎమ్మెల్సీ కవితను వారం రోజుల కస్టడీ ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరగా.. మూడు రోజుల కస్టడీకి అనుమతించింది. కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి తరలించనున్నారు.

అక్కడే ఆమెను మూడు రోజుల పాటు విచారించనున్నారు. ప్రతి రోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఎమ్మెల్సీ కవితను కుటుంబ సభ్యులు, న్యాయవాదులు కలిసేందుకు అనుమతించింది. మరోవైపు కవిత రెగ్యులర్ బెయిల్ పై ఈ నెల 16న కోర్టు విచారణ చేపట్టనుంది. గత నెల 15న లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈడీ కేసులో బెయిల్ వచ్చినా.. CBI కేసులో జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి..

#mlc-kavitha #mla-ktr
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe