Eluru District: ఎంతకష్టమొచ్చిందో.. భర్తను పొట్టుగా కొట్టి పారిపోయిన భార్య..

ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం మండల పరిధిలోని లక్కవరంలో దారుణం చోటు చేసుకుంది. భార్య గుణపంతో భర్త తలను పగలగొట్టింది. భర్త ఏడుకొండలు తలపై భార్య బలంగా కొట్టడంతో ఏడుకొండలు అక్కడే కుప్పకూలాడు. దీనిని గమనించిన స్థానికులు 108 ఆంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు.

Eluru District: ఎంతకష్టమొచ్చిందో.. భర్తను పొట్టుగా కొట్టి పారిపోయిన భార్య..
New Update

ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం మండల పరిధిలోని లక్కవరంలో దారుణం చోటు చేసుకుంది. భార్య గుణపంతో భర్త తలను పగలగొట్టింది. భర్త ఏడుకొండలు తలపై భార్య బలంగా కొట్టడంతో ఏడుకొండలు అక్కడే కుప్పకూలాడు. దీనిని గమనించిన స్థానికులు 108 ఆంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. ప్రమాద స్థిలికి చేరుకున్న వైద్య సిబ్బంది.. తీవ్ర గాయాలపాలైన ఏడుకొండలును స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు దాడికి సంబంధించిన సమాచారంపై ఆరా తీస్తున్నారు.

మరోవైపు ఏడుకొండలు తలపై గుణపంతో బలంగా మోదిన భార్య అనంతరం అక్కడి నుంచి పరారైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రతీరోజు ఏడుకొండలు మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడేవాడని స్థానికులు చెబుతున్నారు. ఎప్పటిలాగే ఇవాళ కూడా మద్యం తాగివచ్చి భార్యతో గొడవకు దిగాడని, భార్య అవేమీ పట్టించుకోకుండా ఇంట్లో తన పని తాను చేసుకుంటుందన్నారు.

దీంతో తాను ఇంతలా మాట్లాడుతున్నా పట్టించుకోవా అని ఏడుకొండలు భార్యను కొట్టినట్లు వారు తెలిపారు. దీంతో భార్య ఓపిక నశించడంతో పక్కనే ఉన్న గుణపంతో ఏడుకొండలు తలపై కొట్టిందని, అనంతరం తాను కూడా చస్తాను అనుకుంటూ ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళ ఎక్కడికి వెళ్లింది అనేదానిపై సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ: మానవత్వం చాటుకున్న ఎంపీ

#absconding #attacked-wife #husband-gunapam #atrocities #lakkavaram #jangareddy-goodem #eluru-district
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి