కీలక భేటీ
అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై హైదరాబాద్ వేదికగా కేంద్ర ఎన్నికల సంఘం బృందం కసరత్తు కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ఈసీ ప్రతినిధి బృందం వరుసగా రెండో రోజు సమావేశమైంది. జిల్లాల వారీగా ఎన్నికల నిర్వహణ ప్రణాళిక, సన్నద్దతను సమీక్షించింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, ఉన్నతాధికారులతో సమావేశమైంది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హోం, రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖల ముఖ్య కార్యదర్శులు జితేందర్, నవీన్ మిత్తల్, సందీప్ కుమార్ సుల్తానియా, ఇతర శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
పూర్తిగా చదవండి..