బ్యాలెట్ల కోసం ప్రత్యేక టేబుళ్లు.. ఒక్కో నియోజకవర్గానికి ఎన్ని పెట్టారంటే

ఈసారి పోస్టల్‌ బ్యాలెట్ల కోసం ప్రత్యేక టేబుళ్లను ఏర్పాటుచేస్తున్నట్లు ఈసీ తెలిపింది. ఈవీఎంల కౌంటింగ్‌ పూర్తయ్యేలోగా పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు కూడా పూర్తిచేసేలా ప్లాన్‌చేసింది. ఇందుకోసం 500ఓట్లకు ఒకటి చొప్పున టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

బ్యాలెట్ల కోసం ప్రత్యేక టేబుళ్లు.. ఒక్కో నియోజకవర్గానికి ఎన్ని పెట్టారంటే
New Update

తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోటీ ఉండబోతున్నట్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. దీంతో డిసెంబర్ 3న వెలువడనున్న ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేసింది. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 49 ప్రాంతాల్లో లెక్కింపు కేంద్రాలను ఏర్పాటుచేయగా 119 నియోజకవర్గాలకుగాను 119 కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఓట్ల లెక్కింపు కోసం ఎక్కువ పోలింగ్‌ కేంద్రాలున్న పది నియోజకవర్గాలు మినహా మిగిలిన నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 14+1 చొప్పున టేబుల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కువ పోలింగ్‌ కేంద్రాలున్న నియోజకవర్గాల్లో లెక్కింపులో జాప్యం జరుగకుండా ఉండేందుకు అధికంగా టేబుళ్లను ఏర్పాటుచేస్తున్నారు.

Also read :Telangana Exit Polls: సర్వేల్లో గందరగోళం.. స్పష్టత లేని ఎగ్జిట్ పోల్స్..

ఈ క్రమంలో పోస్టల్‌ బ్యాలెట్ల కోసం ఈసారి ప్రత్యేక టేబుళ్లను ఏర్పాటుచేయాలని నిర్ణయించిన ఈసీ.. ఈవీఎంల కౌంటింగ్‌ పూర్తయ్యేలోగా పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు కూడా పూర్తిచేసేలా ప్లాన్‌చేసింది. ఇందుకోసం 500ఓట్లకు ఒకటి చొప్పున టేబుళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒకవేళ ఈవీఎంల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేలోగా పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు పూర్తికాకుంటే, చివరి రౌండ్‌ ఈవీఎంల లెక్కింపును నిలిపివేసి ముందుగా పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపును పూర్తిచేయాలని, ఆ తరువాతే చివరి రౌండ్‌ ఈవీఎంల లెక్కింపు చేపట్టాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈసారి 119నియోజకవర్గాలకుగాను దాదాపు రెండున్నర లక్షల పోస్టల్‌ బ్యాలెట్లను జారీచేశారు. కూకట్‌పల్లి, ఉప్పల్‌, మల్కాజ్‌గిరి, పటాన్‌చెరు తదితర నాలుగు నియోజకవర్గాల్లో 400లకుపైగా పోలింగ్‌ కేంద్రాలు ఉండటంతో ఈ నియోజకవర్గాల్లో 20+1 టేబుళ్లు ఏర్పాటు చేస్తు్న్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే రాజేంద్రనగర్‌, ఎల్బీనగర్‌, శేరిలింగంపల్లి, మహేశ్వరం, కూకట్‌పల్లి, మేడ్చల్‌ తదితర ఆరు నియోజకవర్గాల్లో 500లకుపైగా పోలింగ్‌ కేంద్రాలు ఉండడంతో ఈ నియోజకవర్గాల్లో 28+1 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

#postal-ballots #separate-tables #ec
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe