EC Questions On CEO : మాచర్ల (Macherla) లో ఎమ్మెల్యే ఈవీఎం (EVM) లను పగలగొట్టిన ఘటనపై ఎన్నికల సంఘం (Election Commission) సీరియస్ అయ్యింది. ఈ మేరకు సీఈవోకు నోటీసులు పంపించింది. పాల్వాయి గేట్ దగ్గర ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం ఘటనపై సీఈవోను వివరణ కోరింది. ఈ ఘటనలో ఉన్నది ఎమ్మెల్యేనా సీఈసీని ఈసీ ప్రశ్నించింది. ఒకవేళ ఎమ్మెల్యే అయితే ఇంతవరకు కేసు ఎందుకు నమోదు చేయలేదని సీఈసీ ప్రశ్నల వర్షం కురిపించింది. కేసు పెడితే ఎమ్మెల్యేని నిందితుడిగా చేర్చారా? అని నిలదీసింది. ఒకవేళ నిందితుడిగా చేరిస్తే ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారా? లేదా? అని ప్రశ్నించింది. ఒకవేళ కేసు పెట్టకపోతే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.
పూర్తిగా చదవండి..Macherla MLA : మాచర్ల ఎమ్మెల్యేను ఎందుకు అరెస్ట్ చేయలేదు.. సీఈవోపై ఈసీ ప్రశ్నల వర్షం!
మాచర్ల ఎమ్మెల్యే ఈవీఎంలను పగులగొట్టిన వ్యవహారంపై ఈసీ ఏపీ సీఈవోపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఆ ఘటనలో ఉన్నది ఎమ్మెల్యేనా? కేసు పెట్టారా? ఆయనను అరెస్ట్ చేశారా? అంటూ ప్రశ్నలతో కూడిన లేఖను రాసింది. వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించింది.
Translate this News: