/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Earthquake-in-Jammu-and-Kashmir-jpg.webp)
JK Earth Quake:ప్రపంచవ్యాప్తంగా వరుసభూకంపాలు ఆందోళనకలిగిస్తున్నాయి.ఇటీవల జపాన్, టైవాన్, ఇండోనేషియా వంటి దేశాల్లో భూకంపం సంభవించగా.. తాజాగా భారత్ లో భూమి కంపించింది. జమ్మూకశ్మీర్లో భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.9గా నమోదు అయింది. బారాముల్లా ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ పేర్కొంది. వరుసగా నాలుగుసార్లు భూమి కంపించిండంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా ఈ భూకంపంతో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్థి నష్టం ఏమి జరగలేదని అక్కడి అధికారులు తెలిపారు. దీని సంబందించిన పూర్తీ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Another earthquake of magnitude 4.8 on the Richter Scale struck Baramulla, Jammu and Kashmir: National Center for Seismology pic.twitter.com/LVWG6ZnL2E
— ANI (@ANI) August 20, 2024