Pithoragarh Earthquake: భారత్‌లో భూకంపం.. తప్పిన ప్రమాదం

ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌లో ఈరోజు తెల్లవారుజామున భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 3.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఈ భూకంపం దాటికి ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని పేర్కొంది.

New Update
Pithoragarh Earthquake: భారత్‌లో భూకంపం.. తప్పిన ప్రమాదం

Pithoragarh Earthquake: భారత్ లో వరుస భూకంపాలు రావడం కలకలం రేపుతోంది. ఎక్కువ శాతం భూకంపాలు భారత్ లోని ఉత్తరాది ప్రాంతాల్లో సంభవిస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌లో ఈరోజు తెల్లవారుజామున భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 3.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ప్రకంపనలు ఉదయం 6:43 గంటలకు సంభవించాయని పేర్కొంది. ఈ భూకంపం దాటికి ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని పేర్కొంది.

Advertisment
తాజా కథనాలు