AP : రాజకీయ కక్షతోనే ఇలా చేస్తున్నారు.. ద్వారంపూడి బహిరంగ లేఖ..!

కాకినాడ ఎమ్మెల్యే కొండబాబుకు వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లేఖ రాశారు. కక్ష సాధింపుల్లో భాగంగానే తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తాను ఎలాంటి బియ్యం వ్యాపారం చేయలేదన్నారు. త్వరలో అధికారుల బదిలీల్లో జరిగిన అక్రమాలను బయటపెడతానని హెచ్చరించారు.

New Update
AP : రాజకీయ కక్షతోనే ఇలా చేస్తున్నారు.. ద్వారంపూడి బహిరంగ లేఖ..!

Dwarampudi Chandrasekhar Reddy : తనపై పెడుతున్న కేసులను చట్ట ప్రకారం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు వైసీపీ (YCP) కీలక నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఈ మేరకు కాకినాడ (Kakinada) ఎమ్మెల్యే కొండబాబుకు బహిరంగ లేఖ రాశారు. తాను ఎలాంటి బియ్యం వ్యాపారం చేయడం లేదని.. ఈ నిరాధార ఆరోపణల కారణంగా 30 వేల మంది కార్మికులు నష్టపోతున్నారని విమర్శలు గుప్పించారు. కేవలం కక్ష సాధింపుల్లో భాగంగానే తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: మీకు దమ్ముంటే ఇలా చేయండి.. టీడీపీ సభ్యులకు విజయసాయి రెడ్డి ఓపెన్ ఛాలెంజ్..!

కాకినాడలో రాజకీయ కక్షలు ప్రేరేపించే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. అధికారం ఉందనే అహంకారంతో ఇలా చేయడం కరెక్ట్ కాదని హెచ్చరించారు. అధికారుల బదిలీల్లో జరిగిన అక్రమాలను త్వరలో బయటపెడతానని హెచ్చరించారు. ఆరు నెలల తర్వాత అవినీతి అక్రమాలపై స్పందిస్తానన్నారు. ఎమ్మెల్యే కొండబాబుకు ద్వారంపూడి రాసిన లేఖ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.

Advertisment
తాజా కథనాలు