Crime News: EMI కోసం రాళ్ల దాడి చేసిన బైక్ ఫైనాన్స్ కలెక్షన్ ఏజెంట్లు..యువకుడు మృతి..!

ఖమ్మం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. లోన్ EMI చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నాడంటూ వినయ్ అనే యువకుడిపై బైక్ ఫైనాన్స్ కలెక్షన్ ఏజెంట్లు రాళ్లతో దాడికి దిగారు. వారి నుండి తప్పించుకునే ప్రయత్నంలో ఖానాపురం మినీ ట్యాంక్ బండ్ చెరువులోకి దూకిన వినయ్ ఊపిరాడక మృతి చెందాడు.

Crime News: EMI కోసం రాళ్ల దాడి చేసిన బైక్ ఫైనాన్స్ కలెక్షన్ ఏజెంట్లు..యువకుడు మృతి..!
New Update

khammam: ఖమ్మం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. EMI చెల్లించాలని బైక్ ఫైనాన్స్ కలెక్షన్ ఏజెంట్లు రాళ్ల దాడికి దిగడంతో వారి నుండి తప్పించుకునే ప్రయత్నంలో చెరువులో పడి ఓ యువకుడి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. లోన్ ఈఎమ్ఐ చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నాడంటూ వినయ్ అనే యువకుడిని బైక్ ఫైనాన్స్ కలెక్షన్ ఏజెంట్లు వెంబడించారు. ఫైనాన్స్ వారి వేధింపులకు తాళలేక పరిగెత్తిన వినయ్ పై కలెక్షన్ ఏజెంట్లు రాళ్లతో దాడి చేసినట్లు తెలుస్తోంది.

Also Read: అమెరికాలో మిస్సైన హైదరాబాద్ యువకుడు.. నెల రోజులుగా కనిపించని ఆచూకి

వారి నుండి తప్పించుకునే ప్రయత్నంలో వినయ్ నగరంలోని ఖానాపురం మినీ ట్యాంక్ బండ్ చెరువులోకి దూకాడు. చెరువు లోతు భారీగా ఉండటంతో ఆ యువకుడు ఊపిరాడక మృతి చెందాడని తెలుస్తుంది. ఫైర్ డిపార్ట్ మెంట్ సిబ్బంది సహకారంతో వినయ్ మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు.

Also Read: పుష్ప 2, గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ లుక్ పోస్టర్.. రష్మిక బర్త్ డే సర్ ప్రైజ్ అదిరిపోయిందిగా..!

కొద్దినెలల క్రితం ఖమ్మం నగరానికి చెందిన న్యూమోహన్ సాయి ఫైనాన్స్ ఏజెన్సీలో ఓ ద్విచక్రవాహనం కొనుగోలు చేసిన వినయ్..గత మూడు నెలలుగా లోన్ ఈఎమ్ఐ చెల్లించకపోవడంతో కలెక్షన్ ఏజెంట్ల వేధింపులకు గురి చేసినట్లు తెలుస్తోంది. వినయ్ స్వస్థలం రాజస్థాన్ అని సమాచారం. సీసీ ఫుటేజ్ లో బైక్ ఫైనాన్స్ కలెక్షన్ ఏజెంట్ల వేధింపులు రికార్డ్ అవ్వడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

#khammam
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe