Drishyam Movie: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సీక్వెల్, రీమేక్ ట్రెండ్ బాగా నడుస్తోంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఒక మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందంటే వాటికి సీక్వెల్ లేదా రీమేక్ చేయడం సర్వసాధారణం. ఇందులో ఒకటి దృశ్యం మూవీ. ఫ్యామిలీ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన అరుదైన చిత్రాల్లో ఇది ఒకటి. 2013 లో మలయాళంలో మోహన్ లాల్, ఆశా శరత్, సిద్ధిక్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించాడు. మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ సినిమాను ఏకంగా 7 బాషల్లో రీమేక్ చేశారు. రీమేక్ చేసిన అన్నీ భాషల్లోనూ ఈ చిత్రం ఘన విజయం సాధించడం విశేషం. ఇప్పటికే పలు బాషల్లో ఈ సినిమా పార్ట్ 1 తో పాటు పార్ట్ కూడా రిలీజ్ అయిపోయాయి.
పూర్తిగా చదవండి..Drishyam Movie: రికార్డు క్రియేట్ చేసిన దృశ్యం.. హాలీవుడ్ లో రీమేక్
తెలుగు, హిందీ, మలయాళం ఇలా పలు భాషల్లో విడుదలైన దృశ్యం బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం మరో ఘనత సాధించింది. హాలీవుడ్ లో రీమేక్ కానున్న తొలి ఇండియన్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.
Translate this News: