Asaduddin Owaisi: మోదీని మూడోసారి ప్రధానిని చేయకండి.. అసదుద్దీన్ ఒవైసీ రిక్వెస్ట్

బీజేపీ పాలనలో దేశంలో పేదరికం పెరిగిపోయిందని అన్నారు అసదుద్దీన్ ఒవైసీ. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయొద్దని కోరారు. మోదీని మూడో సారి ప్రధానిని చేయొద్దని.. గత పదేళ్లు ప్రధాని ఉన్న మోదీ నిరుద్యోగం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించలేకపోయారని మండిపడ్డారు.

New Update
Asaduddin: కేసీఆర్ నిజం చెప్పండి.. విలీనంపై అసదుద్దీన్ సూటి ప్రశ్న!

AIMIM Chief Asaduddin Owaisi: బీజేపీ, మోదీపై విమర్శలు గుప్పించారు AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయొద్దని అన్నారు. మోదీని మూడో సారి ప్రధానిని చేయొద్దని దేశ ప్రజలను కోరారు. మోదీ పాలనలో దేశంలో పేదరికం ప్రధాన సమస్యగా మారిందని అన్నారు. గత పదేళ్లు ప్రధాని ఉన్న మోదీ నిరుద్యోగం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించలేకపోయారని మండిపడ్డారు. సాయుధ బలగాలలో ప్రధాని మోదీ 'అగ్నివీర్' పథకాన్ని తీసుకొచ్చిన విధంగానే పారామిలటరీ బలగాలలో కూడా ఈ పథకాన్ని తీసుకువస్తారని అన్నారు.

ALSO READ: జమ్మూలో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

"నేను హిందూ-ముస్లిం చేయను" అని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. "ప్రధానిని 'ఘుష్పేటి' అని పిలుస్తున్నారు? హిందూ మహిళల నుండి తీసిన మంగళసూత్రం ఎవరికి ఇస్తారు? అతను ముస్లింలను మాత్రమే సూచిస్తున్నాడు. ఎవరు కలిగి ఉన్నారు. "వారి బట్టల నుండి వ్యక్తులను గుర్తించండి"?" అని అన్నారు.

Advertisment
తాజా కథనాలు