Doctor Negligence: ఓ మహిళ చాలా కాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. ఎక్స్రేలో మూత్రాశయంలో రాయి ఉందని, ఆ రాయి వలన ఒక కిడ్నీ పూర్తిగా పాడైందని, వెంటనే ఆ కిడ్నీని తొలగించాలని డాక్టర్ చెప్పారు. వెంటనే ఆమెను హాస్పిటల్ లో అడ్మిట్ చేసుకుని.. ఆ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు ఆపరేషన్ కు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత పాడైన కిడ్నీని తీసేయడానికి బదులు.. చక్కగా ఉన్న కిడ్నీ తొలగించారు. ఈ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. రోగి తరఫు బంధువులు ఈ విషయంపై డాక్టర్ పై ఆరోపణలు చేశారు. మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కానీ డాక్టర్ ఈ ఆరోపణను తోసిపుచ్చారు. ఆపరేషన్ కరెక్ట్ గానే జరిగిందని చెప్పారు. సర్జరీ చేసిన డాక్టర్ సంజయ్ ధంఖర్ నిర్వహిస్తున్న ధంఖర్ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది.
పూర్తిగా చదవండి..Doctor Negligence: దారుణం.. పాడైన కిడ్నీ బదులు మరో కిడ్నీ తీసేశాడు!
అనారోగ్యంతో బాధపడుతున్న మహిళను ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో చేర్చారు. కిడ్నీ పాడైందని చెప్పిన డాక్టర్లు ఆపరేషన్ వెంటనే చేయాలన్నారు. ఆపరేషన్ సమయంలో ఒక కిడ్నీకి బదులు వేరే కిడ్నీ తొలగించారు. ఈ ఘటన రాజస్థాన్ లో జరిగింది. బాధితురాలి బంధువుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.
Translate this News: