Rape: నర్సుపై డాక్టర్ అత్యాచారయత్నం.. మర్మాంగం కోసేసిన బాధితురాలు!

బీహార్ రాష్ట్రంలో నర్సుపై అత్యాచార ఘటన సంచలనం రేపుతోంది. సమస్తిపూర్ జిల్లా గంగాపూర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సుపై అక్కడే పనిచేస్తున్న మగ డాక్టర్ నర్సుపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. వైద్యుడి మర్మాంగం కోసేసింది నర్సు.

New Update
bihar

Bihar: దేశంలో మహిళా వైద్యులపై దాడులు, అత్యాచారాలు, హత్యలు కలకలం రేపుతున్నాయి. ఇటీవలే కోల్ కతాలో అభయ ఘటన దేశాన్ని కుదిపేయగా.. హైదరాబాద్ లోనూ గాంధీ హాస్పిటల్ జూనియర్ డాక్టర్ పై పేషెంట్ దాడి చేయడం సంచలనం రేపింది. ఈ వరుస ఘటనలపై పెద్ద ఎత్తున నిరసనలు, పోలీసులు శిక్షలు విధిస్తున్నప్పటికీ కామాంధుల చేతిలో ఏదో ఒక మూలన లేడీ డాక్టర్లు, నర్సులు బలవుతూనే ఉన్నారు. కామాంధులు, మద్యం మత్తుగాళ్లే కాదు పురుష డాక్టర్లు సైతం మహిళా వైద్య సేవకురాళ్లను వేధిస్తూ నీచంగా వ్యవహరిస్తున్నారు. సీనియర్లు చెప్పినట్లు వినకుంటే భవిష్యత్తు లేకుండా చేస్తామంటూ భయపెట్టి లొంగదీసుకుంటున్నారు. మరికొందరు పని పేరిట పిలిచి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి దారుణమైన సంఘటనే బీహార్ రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసింది.

ఇద్దరు సహచరులతో కలిసి దారుణం..
వివరాల్లోకి వెళితే.. బీహార్ రాష్ట్రంలో నర్సుపై వైద్యుడు అత్యాచారయత్నం చేసిన ఘటన మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈ మేరకు సమస్తిపూర్ జిల్లా గంగాపూర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సుపై అదే హాస్పిటల్ లో పనిచేస్తున్న మగ డాక్టర్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. విధుల్లో ఉండగానే తన ఇద్దరు సహచరులతో కలిసి ఆమెపై దారుణానికి ఒడిగట్టాడు. దీంతో కామాంధులతో పోరాడిన నర్సు.. చివరికి వైద్యుడి మర్మాంగాన్ని కోసేసింది. అనంతరం హాస్పిటల్ సిబ్బంది సహకారంతో వారిచేరనుంచి తప్పించుకుంది. ఆ కామాంధుడికి అక్కడే చికిత్స అందిస్తుండగా.. విషయం తెలియగానే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు