తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లపథకం అమలుపై సందిగ్ధత నెలకొంది. ఇళ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చు విషయంలో ప్రభుత్వానికి ఇంకా స్పష్టత రాలేదు. ఇళ్ల నిర్మాణం విషయంలో అధికారులు పలు సందేహలు వ్యక్తం చేస్తున్నారు. పేదల ఇళ్ల నిర్మాణానికి రూ.5లక్షల లోపే ఖర్చవుతుందని తెలిపారు. రూ.5లక్షలతో ఇళ్లు నిర్మించుకోవాలంటే 70 గజాల స్థలం కావాలని వారంటున్నారు. అయితే తెలంగాణలో 60 గజాల కంటే తక్కువగా సొంత జాగ ఉన్నవాళ్లే ఎక్కువగా ఉన్నారని అధికారులు ఒక అంచనాకు వచ్చారు. విస్తీర్ణంతో సంబంధం లేకుండా అందరికీ రూ.5లక్షలు ఇస్తే అందులో ఎక్కువ మొత్తం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.ఈ సందేహల నేపథ్యంలో ఇందిరమ్మ ఇండ్ల పై సందిగ్ధత నెలకొంది. సందేహలు నివృత్తి అయ్యాకే ఇందిరమ్మ ఇళ్ల విషయం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
పూర్తిగా చదవండి..Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ.. అప్పటి నుంచే!
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లపథకం అమలుపై సందిగ్ధత నెలకొంది. ఇళ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చు విషయంలో ప్రభుత్వానికి సరైన స్పష్టత రాలేదు. ఇళ్ల నిర్మాణం విషయంలో అధికారులు పలు సందేహలు వ్యక్తం చేస్తున్నారు.
Translate this News: