/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Kejriwal-Arrest.jpg)
CM Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరోసారి నిరాశే ఎదురైంది. లిక్కర్ స్కాం కేసులో సీబీఐ అరెస్టును సవాల్ చేయడంతోపాటు మధ్యంతర బెయిల్ కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్లపై తీర్పు రిజర్వ్ చేసింది ఢిల్లీ హైకోర్టు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై జులై 29న విచారణ చేపడతామని వెల్లడించింది.
#UPDATE | Delhi HC reserves order on Delhi CM Arvind Kejriwal's plea challenging his arrest by CBI in the Excise case. Meanwhile the Court also reserved the order on Interim bail of Arvind Kejriwal.
The Court fixed July 29, for regular bail plea hearing. https://t.co/gzStybA6vN
— ANI (@ANI) July 17, 2024
ఈడీ కేసులో మధ్యంతర బెయిల్..
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. లిక్కర్ స్కాం కేసు (Liquor Scam Case) లో ఆయనకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్టు. కేసు విచారణను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ తీర్పు వెలువరించింది. కేజ్రీవాల్ ను లిక్కర్ స్కాం కేసులో మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈడీ కేసులో బెయిల్ వచ్చినా.. సీబీఐ కేసులో సీఎం కేజ్రీవాల్ జైలులోనే ఉండనున్నారు.
సీఎం కేజ్రీవాల్ ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధి అని సుప్రీం పేర్కొంది. అతను దాదాపు 90 రోజులు జైలు శిక్ష అనుభవించారని చెప్పింది. ఈడీ కస్టడీని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై మే 17న తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం ఈరోజు కేజ్రీవాల్ కు ఉరటనిస్తూ మధ్యంతరం బెయిల్ ను మంజూరు చేసింది. కాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పై ఆప్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడు తిరిగి తమ వద్దకు వస్తున్నారని సంబరాలు జరుపుకుంటున్నారు.